డిఫరెంట్ మూవీస్ తో, సర్ ప్రైజ్ చేసే క్యారెక్టర్స్ తో తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అదిత్ అరుణ్. ఆయన నటించిన తుంగభద్ర, పీఎస్ వీ గరుడ వీకెండ్ లవ్, వేగ, డియర్ మేఘ, “డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ” లాంటి చిత్రాలు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ యంగ్ టాలెంటెడ్ తన పేరును త్రిగుణ్ గా మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. రీసెంట్ ట్వీట్ లో ఇట్స్ ద న్యూ మీ త్రిగుణ్ అంటూ అనౌన్స్ చేశారు. ఇకపై తనను మీడియా మిత్రులు, చిత్ర పరిశ్రమలోని స్నేహితులు, పెద్దలు త్రిగుణ్ గా పిలవాలని ఈ యంగ్ హీరో కోరారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న “కొండా” చిత్రంలో నటిస్తున్న త్రిగుణ్..ఈ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ ఫిల్మ్ అవుతుందని చెబుతున్నారు. ‘కొండా’ ట్రైలర్…
Author: M.D ABDUL - Tollywoodtimes
‘రుద్రవీణ’ షూటింగ్ ప్రారంభం
శ్రీరామ్ నిమ్మల, ఎల్సా ఘోష్, శుభశ్రీ, సోనియా సత్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రుద్రవీణ. రఘు కుంచె ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. సాయి వీల సినిమాస్ పతాకంపై రాగుల లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి మధుసూదన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా యానాం లో రుద్రవీణ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా అక్కడే జరుగుతుంది. సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రుద్రవీణ సినిమాను తెరకెక్కిస్తామని ఈ సందర్భంగా దర్శకుడు జి మధుసూదన్ రెడ్డి తెలిపారు. న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులతో పాటు మంచి టెక్నికల్ టీమ్ సపోర్ట్ తో సినిమాను క్వాలిటీగా, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు. ఛమ్మక్ చంద్ర, చలాకీ చంటి, ధన్ రాజ్, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి…
మెగాస్టార్ తో మరోసారి త్రిష!?
త్రిష మెగాస్టార్ కి హీరోయిన్ గా నటించబోతుందట అంటూ సోషల్ మీడియాలో వార్త బాగా వైరల్ అవుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో యువతరం దర్శకుడు వెంకీ కుడుముల ఓ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను ఫైనల్ చేశారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మెగాస్టార్ సరసన మరో హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపిస్తోంది. చిరు – త్రిష జోడీ గతంలోనే ఒక సినిమా చేయాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా ఆ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఇప్పుడు ఈ జోడీ వెంకీ కుడుముల సినిమాలో కనిపింబోతుందట. మెగాస్టార్ కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు కాబట్టి, వెంకీ సినిమాని కూడా త్వరలోనే పట్టాలెక్కి స్తారట. కాగా…
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ ‘రంగ రంగ వైభవంగా’ టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై రూపొందుతోన్న సినిమా ‘రంగ రంగ వైభవంగా’.. టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ విడుదలయింది. ఉప్పెన సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బాపినీడు.బి సమర్పణలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రానికి ‘రంగ రంగ వైభవంగా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. కేతికా శర్మ హీరోయిన్గా నటించింది. సోమవారం ఈ సినిమా టైటిల్ టీజర్, ఫస్ట్ లుక్ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ గమనిస్తే యూత్ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మధ్య నడిచే బటర్ ఫ్లై కిస్ థియరీ కొత్తగా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం టీజర్ను నెక్ట్స్ లెవల్కి…
సౌత్ లో ‘అఖండ’ నార్త్ లో సల్మాన్తో మెయిన్ ఛాలా… జోరుమీదున్న ప్రగ్యా జైస్వాల్
`కంచె` సినిమా హీరోయిన్ ప్రగ్యాజైస్వాల్కి సౌత్లో ప్రత్యేకంగా పరిచయాలేవీ అక్కర్లేదు. రీసెంట్గా అఖండ బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో ప్రగ్యా జోరు మరో రేంజ్లో ఉంది. 50 రోజులు పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా నటించిన అఖండ సినిమా. అదే జోరుతో నార్త్ లోనూ హల్చల్ చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. సల్మాన్ ఖాన్ సరసన మెయిన్ ఛాలా అంటూ ఆడిపాడి హిందీ డెబ్యూ ఇచ్చేశారు ప్రగ్యా. ఈ పాటలో సల్మాన్, ప్రగ్యా మధ్య కెమిస్ట్రీ అద్దిరిపోయిందని అంటున్నారు ఆడియన్స్. రీసెంట్ టైమ్స్ లో రిలీజైన సింగిల్స్ లో మెయిన్ ఛాలాకు మంచి స్పందన వస్తోంది. ఈ పాట గురించి ప్రగ్యా మాట్లాడుతూ “సల్మాన్ ఖాన్ సార్తో పనిచేయాలని ప్రతి ఆర్టిస్టుకీ ఒక కల ఉంటుంది. నేను ఈ రంగంలో అడుగుపెట్టినప్పుడు…
ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ విడుదలకు సిద్దమయ్యాడు. ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్ లో మంచి అంచనాలు నెలకొంటున్నాయి. మరి దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఫిబ్రవరి 25న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ లో రిలీజ్ చేయాలని సిద్ధమయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 25 రిలీజ్ లో ఎలాంటి మార్పు లేదట. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కి గాను ఒక క్లారిటీ ఇచ్చేశారట. అందులో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడ భారీ స్థాయి విడుదలకి ప్లాన్ చెయ్యాలని చూస్తున్నారట. అన్ని భాషల నుంచి కూడా పెద్దగా ఎలాంటి సినిమాలు లేకపోవడంతో ‘భీమ్లా నాయక్’ కు మరింత ప్లస్ అయ్యిందని చెప్పాలి.
బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోకు చిరు ఎందుకు రాలేదు?
ఓటీటీలో అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్మెంట్ తో ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోతో బాలయ్య యావత్తు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షోకి చాలా మంది సేలబ్రిటీలు వచ్చారు. వారితో సరదాగా మాట్లాడుతూనే ప్రేక్షకులకు కావల్సిన కాంట్రవర్సీస్ మొదలకొని ఎమోషన్స్ వరకు అన్ని కోణాల్లో ప్రశ్నలు గుప్పిస్తూ అలరిస్తారు బాలయ్య. అయితే తాజాగా ఒక న్యూస్ బాగా వైరల్ అయింది. అదేంటంటే ఇంత మంది సెలబ్రిటీలు వచ్చిన ఈ షోకి టాలీవుడ్ మెగా బాస్ చిరంజీవి రాకపోవడం వెనక ఏంటి మతలబు అంటూ కొందరు ఆరా తీస్తున్నారు. మొదలుపెట్టిన రోజు నుంచి ఈ షోకు చిరంజీవి వస్తారా.. రారా? అనే చర్చ ఓవైపు నడుస్తూనే ఉండగా, మరోవైపు బాలయ్య టాక్ షో సీజన్-1 పూర్తయింది. చిరంజీవి లేకుండానే ఓ సీజన్ ముగిసింది. ఇంతకీ బాలయ్య టాక్…
‘కొండా’ చిత్రం గురించి వర్మ ఏం చెబుతున్నారు?
కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడ అసాధారణ శక్తులుగా మారుతారు. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం. ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్. ఇకపోతే ఆర్కే, భారతక్క : తెలంగాణలో ఒక్క సామెత ఉంది. ‘పొట్టోన్ని…
‘జయహో ఇండియన్స్’ నుంచి విడుదలైన ‘ఆంథమ్’కు అనూహ్య స్పందన!!
ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయహో ఇండియన్స్. ఆర్ రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. అది స్పష్టంగా పోస్టర్లో కనిపించేలా హీరో లుక్ డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా వీడియో సాంగ్ విడుదలైంది. జయహో ఇండియన్స్ ఆంథమ్ ఇది. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ పాటలో లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. జైపాల్ రెడ్డి నిమ్మల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ…
‘సర్కారు వారి పాట’ విడుదల తేదీపై క్లారిటీ రాదా?!
సూపర్ స్టార్ మహేష్ బాబు -కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న ‘సర్కారు వారి పాట’ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. దర్శకుడు పరశురామ్ ఈ చిత్రాన్ని ప్రిన్స్ మహేష్ కెరీర్ లోనే మరో మైలు రాయిగా నిలిచిపోయే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై మహేష్ అభిమానులు కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కొంచెం బ్యాలన్స్ ఉంది. ఆ బ్యాలన్స్ ను మేకర్స్ కాస్త నెమ్మదిగానే ప్రారంభించనున్నట్టు తెలిసింది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు ప్రచారంలో ఉంది. అతి త్వరలో ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త అప్డేట్ ని మేకర్స్ రివీల్ చెయ్యబోతున్నట్టు తెలిసింది. మరి అది కూడా బహుశా సినిమా ఫస్ట్ సింగిల్…
