విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై చలపతి పువ్వల దర్శకత్వంలో ఏమ్. సుధాకర్ రెడ్డి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం ‘కళాపోషకులు’. నటుడు జెమిని సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు హైదారాబాద్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ మూవీ టీజర్ ను మీడియా తరుపున సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విడుదలచేసి చిత్ర విజయాన్నిఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో.. దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ – ‘‘ముందుగా నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సుధాకర్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడం వల్లే ఔట్పుట్ ఇంతబాగా వచ్చింది. ఆ నలుగురు…
Author: M.D ABDUL
‘ఎఫ్ 2’కి ఇండియన్ పనోరమ అవార్డ్స్
2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు, చిత్ర డైరెక్టర్ అనీల్ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాతో పాటు డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇండియన్ పనోరమ అవార్డ్ అందుకోనున్నారు. ఆ ఏడాదిలో ఇండియన్ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా ‘ఎఫ్ 2’నే కావడం విశేషం. విక్టరీ వెంకటేష్, మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్తేజ్, మెహరీన్ నటించిన ఈ చిత్రాన్ని దిల్రాజు సమర్పణలో…
‘టెంప్ట్ రాజ’ మోషన్ పోస్టర్ విడుదల
సే క్రియేషన్స్ బ్యానర్ పై ఏఆర్కె ఆర్ట్స్ సమర్పణలో వస్తోన్న సినిమా “టెంప్ట్ రాజ”. ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా మోషన్ పోస్టర్ను తాజాగా విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరో మరియు నిర్మాత రాంకి (వీర్నాల రామకృష్ణ) మాట్లాడుతూ… “టెంప్ట్ రాజ” సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతారు. అడల్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా యూత్ ని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసాం. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుపుతాము. పోసాని కృష్ణ…
వాస్తవ ఘటనలతో ‘మహాలక్ష్మి బి.ఏ’
టి.డబ్ల్యూ.ఎస్ టాకీస్ బ్యానర్ పై వస్తోన్న లవ్, డ్రామా చిత్రం మహాలక్ష్మి బి.ఏ. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఈ చిత్ర మొదటి లిరికల్ వీడియో ‘ఇప్పుడిప్పుడే’ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. రమ్య చిన్ని ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని రాజేష్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిత్రీకరణ మొత్తం హైదరాబాద్ లో జరగనుంది. హర్ష ప్రవీణ్ సంగీతం అందించిన ఈ పాటకు ప్రభాకర్ దండు సాహిత్యం అందించారు. నిర్మాత: రాజేష్ఎడిటర్: దీపక్పబ్లిసిటీ డిజైనర్: రామ్ కోతకొండకెమెరామెన్: లోకేష్లిరిక్స్: ప్రభాకర్ దండుదర్శకత్వం: రాజేష్
సంక్రాంతి బరిలో రానా ‘అరణ్య’
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి తెలుగు, హిందీ, ఇతర భాషల్లో సాధించిన వరుస విజయాలతో పాన్ ఇండియా స్టార్గా మారారు. ఆయన నెగటివ్ రోల్ పోషించిన మునుపటి హిందీ చిత్రం ‘హౌస్ఫుల్ 4’ బ్లాక్బస్టర్ హిట్టయింది. ఇప్పుడు తెలుగులో ‘అరణ్య’ పేరుతో విడుదలవుతున్న బహు భాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేసిన ఈ భారీ బడ్జెట్ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్నది. మంగళవారం ఆవిష్కరించిన ఒక సరికొత్త పోస్టర్, మోషన్ వీడియో ద్వారా ఈ సినిమా 2021 సంక్రాంతికి విడుదలవుతుందని చిత్ర బృందం ప్రకటించింది. ఈ పోస్టర్లో ఒక వైపు ఒక విరిగిన గోడ, రానా, విష్ణు విశాల్ కనిపిస్తుండగా, మరోవైపు ఏనుగులు కనిపిస్తున్నాయి. వృక్షాలు, అడవులను సంరక్షించమనే మెసేజ్ను…
రామరాజు వాయిస్ కోసం వెయిటింగ్
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్ర రామరాజు ఫర్ భీమ్ టీజర్ ఈ నెల 22న విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. ఈ టీజర్ విడుదల కోసం మెగా, నందమూరి అభిమానులే కాదు.. ప్రేక్షక లోకం ఎంతగానో ఎదురుచూస్తుంది. దీనికి కారణం ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్లో చరణ్ వర్కవుట్స్ చేయటం, యాక్షన్ పార్ట్ చూపించటం దానికి ఎన్టిఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వటం చాలా హైలెట్ అయ్యింది. అయితే అసలు ప్రాబ్లమ్ ఇప్పుడే మొదలైంది. అదేంటి అంటే ఇప్పడు రివర్స్ గేమ్ స్టార్టయ్యింది. ఈసారి ఎన్టీఆర్ యాక్షన్ కి రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ మద్య కొంత యాక్షన్ స్టార్టయ్యింది. భీమ్ ఫర్ రామరాజు టీజర్ విషయంలో మా హీరో…
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి రూపాయల విరాళంగడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కుండపోతగా కురిసిన వర్షాల వల్ల హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. అపార ప్రాణ నష్టంతో పాటు, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ప్రకృతి భీభత్సంతో అల్లాడిపోతున్న వారికి నా వంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి రూ. కోటి రూపాయలు విరాళం ప్రకటిస్తున్నాను. ఎవరికి వీలైనంత సాయం వాళ్లని చేయమని ఈ సందర్భంగా కోరుతున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణలో వరద బాధితులకు రెబల్ స్టార్ ప్రభాస్ విరాళం 1 కోటి 50 లక్షలుతెలంగాణ లో భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం ఏర్పడింది. హైదరాబాద్ నగరంలో ఎన్నో ప్రాంతాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరి సహాయార్ధం రెబల్ స్టార్ ప్రభాస్ తెలంగాణ సీఎం సహయనిధి కి…
మీర్జాపూర్ 1ని మించేలా మీర్జాపూర్ 2: పంకజ్ త్రిపాఠి
ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన సూపర్ హిట్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 1కి సీక్వెల్ గా మీర్జాపూర్ సీజన్ 2 అక్టోబర్ 23న రాబోతుంది. సీజన్ 1లో ఖాలీన్ భయ్యాగా ఫేమెస్ అయిన నటుడు పంకజ్ త్రిపాఠి సిజీన్ 2 రిలీజ్ సందర్భంగా తెలుగు సినీ పాత్రికేయలతో ముచ్చటించారు, ఆయనతో జరిగిన చిట్ చాట్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీర్జాపూర్ సీజన్ 1 లో నేను పోషించిన కాలిన్ భయ్య పాత్ర నన్ను తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. రోజుకి సోషల్ మీడియా ద్వారా తెలుగు వారు పంపిస్తున్న మెసేజ్ లు చదువుతున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీర్జాపూర్ సీజన్ 2 రాబోతుందనే ప్రకటణ వచ్చినప్పటి నుంచి తెలుగులో రిలీజ్ అవుతుందా లేదా అని…
‘ఆహ్వానం’ లోగో వదిలిన మంచు మనోజ్
వజ్ర మూవీ ప్రమోషన్ ఏజెన్సి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరంలేదు. ఎందుకంటే ఎందరో స్టార్ హీరోలతో సహా ఎన్నో సూపర్హిట్ మూవీస్కి తమదైన శైలిలో ప్రమోషన్స్ చేసి ఆ చిత్రాలను ప్రేక్షకులకి మరింతగా చేరువయ్యేలా చేసిన ఘనత వారిది. ప్రస్తుతం వజ్ర గ్రూప్స్ ఆహ్వానం పేరుతో ఆతిథ్య రంగంలోకి అడుగుపెడుతున్నారు. దీనిలో భాగంగా మొదటగా కన్వెన్షన్ హాల్ను ఏర్పాటు చేశారు. ఇటివలే ప్రముఖ హీరో మంచు మనోజ్ ఆహ్వానం లోగోను ఆవిష్కరించారు. అక్టోబర్ 23న సాప్ట్ లాంచ్ చేస్తున్నారు. `మీరు ఒక పార్టీని హోస్ట్ చేయాలంటే 500 నుండి 1000 మందికి వసతి కల్పించడానికి ఒక కన్వెన్షన్ హాల్ అవసరం. మేము మీ గో-టు సోర్స్. మీ ఈవెంట్లను మా ఉత్తమ సేవలతో ఆదర్శప్రాయంగా చేయడానికే మేము ఈ రంగంలోకి ప్రవేశించడం జరిగింది. వినియోగదారుడి సంతృప్తే ప్రధమ…
ప్రభాస్ ‘రాధేశ్యామ్’కి యంగ్ మ్యూజిక్ దర్శకుడు
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గొపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం “రాధేశ్యామ్. బాహుబలి1, బాహుబలి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న “రెబల్స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్స్టార్” డాక్టర్ యూ.వి. కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమెద్, ప్రసీధ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్నో సూపర్హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు,…
