ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర సెన్సేషనల్ గా మారిన సినిమానే ‘ధురంధర్ 2’. యువ దర్శకుడు ఆదిత్య ధర్, రణ్వీగ్ సింగ్ కలయికలో చేసిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గ్రాండ్ గా విడుదలకి వచ్చి అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాపై అనేకమంది స్టార్ నటులు, దర్శకులు కూడా తమ స్పందన అందిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ కూడా ఈ సినిమాపై స్పందించడం జరిగింది. ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్ ఆకాశానికి ఎత్తేసారు. నిజంగా జరిగిన ఘటన లను కల్పిత పాత్రలతో తెరకెక్కించి ఒక అద్భుతమైన సినిమాని దర్శకుడు ఆదిత్య ధర్ అందించారు అని తెలిపారు. అలాగే సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా నిడివి సమస్య తను నోటీస్ చేయలేదని కొన్ని…
Day: March 20, 2026
‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదల
ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ‘నో వే హోమ్’ సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో…
మరో గొప్ప ‘మెగా’ ప్రయత్నం!
* ఉచిత విద్యా ప్రాజెక్ట్ పై చిరంజీవి దృష్టి వెండితెర రారాజుగా అభిమానులు, ప్రేక్షకులని అలరించే మెగాస్టార్ చిరంజీవి, సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ, తెరపై మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా రియల్ హీరోగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఆయన స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి సంస్థలు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తూ, అనేక సంక్షోభ సమయాల్లో ప్రజలకు ప్రాణదాతలుగా నిలిచాయి. ఏదైనా ప్రకృతి విపత్తు, అనుకోని అత్యవసర పరిస్థితి అయినా, సహాయం అందించడానికి ముందుకు వచ్చే వారిలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో చిరంజీవి ఒక ముఖ్యమైన కొత్త కార్యక్రమం గురించి చెప్పారు. “రక్తం ప్రాముఖ్యతను, రక్త కొరత కారణంగా ఎన్ని ప్రాణాలు పోతున్నాయో నేను అర్థం చేసుకున్నప్పుడు,…
