ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఎన్నికల్లో స్వార్ధపరులకు ఓట్లు వేయకండి: నట్టి కుమార్

ఫిలిం ఛాంబర్, నిర్మాతల మండలి ఎన్నికల్లో స్వార్ధపరులకు ఓట్లు వేయకండి:: నట్టి కుమార్

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రజలంతా ఆరోగ్యంతో సుఖంగా జీవించాలని మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకుని వచ్చి, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు. అంతకుముందే ఆ కోవలోనే దర్శకరత్న దాసరి మెడిక్లెయిమ్ పాలసీని నిర్మాతల మండలి 1100 మంది సభ్యులకు వర్తింపజేశారు. నిరంతరం సినిమా పరిశ్రమ బాగుకోసం పాటు పడిన దాసరి లాంటి పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సిన కొందరు నేటి సినీ పెద్దలు అలాంటి వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి చేరుకోవడం దారుణమని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు. గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన స్పందిస్తూ, 7 లక్షల మెడిక్లెయిమ్ పాలసీని కౌన్సిల్ లోని ప్రతీ సభ్యుడికీ అందజేయాలని డిమాండ్ చేశారు. నిధులు తక్కువగా ఉంటే కనీసం 5…