సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ఈ చిత్రానన్ని సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 18న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో… నిర్మాత సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘‘‘శ్రీదేవి శోభన్బాబు’ నా మనసుకు ఎంతో దగ్గరైన సినిమా. సంతోష్, ప్రశాంత్ని అనుకోకుండా ఓ కాఫీ షాప్లో కలిశాను. అలా స్టార్ట్ అయిన మా ప్రయాణం ఇక్కడి వరకు వచ్చింది. చిన్న ఆలోచనతో ప్రారంభమైన ఈ సినిమా కోసం అందరం మనసు పెట్టి పని చేశాం. మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్కి ట్రాన్స్ఫర్ అయ్యింది. సిటీలో పుట్టి పెరిగిన సంతోష్లాంటి హీరో ఇలాంటి విలేజ్ బ్యాక్…
