కవలలు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. TSR మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్సవం సందర్భంగా, తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో, ప్రొడక్షన్ నం.1 చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదలైంది. నిజ జీవితంలోని కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మా కంటూ ఓ స్థానం ఏర్పరుచుకునేందుకు TSR మూవీ మేకర్స్ సంస్థను ప్రారంభిస్తున్నాం. ఈ సందర్భంగా ప్రొడక్షన్ నం. 1 చిత్రానికి శ్రీకారం చుడుతున్నాం. మా పిల్లలు రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్టర్ మాన్ బద్రీ అన్న సపోర్ట్ ఎంతో ఉంది. ముఖ్య అతిథి స్టంట్ మాన్ బద్రీ మాట్లాడుతూ……
