సినిమా అంటేనే కోట్ల బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం. అలాంటిది జీరో బడ్జెట్ తో సినిమా సాధ్యమా? అంటే సాధ్యమే అంటూ వారణాశి సూర్య ఓ వినూత్న ప్రయోగానికి తెరతీస్తూ ఈజీ మూవీస్ బేనర్ పై `గండ` అనే చిత్రాన్ని డైరక్ట్ చేస్తూ నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వారణాశి సూర్య మాట్లాడుతూ…“మా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 30న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సినిమా తో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మా ఈజీ మూవీస్ సంస్థ త్వరలో…
