తెలుగు ఇండియన్ ఐడల్2తో సంగీత ప్రపంచంలో సరికొత్త జోరు కనిపిస్తోంది. ఆస్కార్ విజేత సినీగీత రచయిత చంద్రబోస్ ప్రత్యేక అతిథిగా తెలుగు ఇండియన్ ఐడల్2 ఎపిసోడ్ చిత్రీకరించారు. టాప్ 9 కంటెస్టంట్లతో పాటు ఆ వేదిక మీద చంద్రబోస్ని చూసిన జనాల ఉత్సాహానికి అంతే లేదు. తెలుగు సినీ సంగీతంలో అజరామరమైన కొన్ని గీతాలను పోటీదారులు ఎంపిక చేసుకుని పాడిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వారిలోని ప్రతిభ, కళ పట్ల వారికున్న ఆసక్తి చూసి అబ్బురపడ్డారు. అందరిలోనూ సౌజన్య భాగవతుల ప్రత్యేక స్థానాన్న ఆక్రమించారు. నాని సినిమాలోని పెదవే పలికిన మాటల్లోనే గీతాన్ని ఆలపించారు సౌజన్య భాగవతుల. ఆ పాటను ఆమె పాడిన తీరుకు ఉప్పొంగిపోయారు ప్రముఖ సినీ గేయరచయిత చంద్రబోస్. అద్వితీయమైన గళం అంటూ ప్రశంసించి తన కలాన్ని ఆమెకు బహూకరించారు. ఆస్కార్ అవార్డు…
