నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్తో రాబోతోన్న ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం రమాకాంత్ రెడ్డి వహించారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్లు నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్కు హీరో సుమన్, నిర్మాత ఏ.ఎం.రత్నం వంటి వారు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ ఈవెంట్లో.. నిర్మాత డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నేను విద్యా వేత్తగా ఇంజనీరింగ్ కాలేజీలను నిర్వహిస్తున్నాను. పిల్లల్లో ఉన్న ప్యాషన్కు ఓ ఫ్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతోనే నాని మూవీ వర్క్స్ను స్థాపించాను. నేను ఉన్న, పెరిగిన ఊరుని…