నవతరం హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘స్వాగ్’. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకుడు. వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించినట్టు దర్శకుడు చెప్పుకున్నారు. ఈ చిత్రం నేడు ( అక్టోబర్ 04, 2024) ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం… కథలోకి … రాజ కుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ సాగుతుంది. శ్వాగణిక వంశానికి చెందిన రాజ కుటుంబానికి చెందిన కథ ఇది. అనుబంధం లేని ఓ మొరటి మనిషి భవభూతి (శ్రీ విష్ణు) ఓ పోలీస్ ఆఫీసర్. తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు అనుభూతి (రీతూ వర్మ) ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది. ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం. ఈ మధ్యలో సింగ (యంగ్ శ్రీ…