2019 సంక్రాంతి సినిమాల బరిలో విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎఫ్ 2..ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస విజయాలను అందుకున్న దర్శకుడు అనీల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు, చిత్ర డైరెక్టర్ అనీల్ రావిపూడికి అరుదైన గౌరవం దక్కింది. 2019 ఏడాదికిగానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమాతో పాటు డైరెక్టర్ అనీల్ రావిపూడి ఇండియన్ పనోరమ అవార్డ్ అందుకోనున్నారు. ఆ ఏడాదిలో ఇండియన్ పనోరమను దక్కించుకున్న ఏకైక తెలుగు చిత్రం కూడా ‘ఎఫ్ 2’నే కావడం విశేషం. విక్టరీ వెంకటేష్, మిల్కీబ్యూటీ తమన్నా, వరుణ్తేజ్, మెహరీన్ నటించిన ఈ చిత్రాన్ని దిల్రాజు సమర్పణలో…