దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆదరణ పొందుతూ దూసుకెళ్తోంది. పల్లెటూళ్లలో అయితే తెరలు ఏర్పాటు చేసుకుని ఊరు ఊరంతా కలిసి సినిమాను చూస్తున్నారు.. ఎమోషనల్ అవుతున్నారు. అలాగే బలగం సినిమాకు 7 ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్ రాజు, దర్శకుడు వేణు, నిర్మాతలు హర్షిత్, హన్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్మీట్లో..…
