డిఫరెంట్ కంటెంట్తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా ప్రేక్షకులను మరింతగా ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. రీసెంట్గా ఆహాలో విడుదలైన భానుమతి అండ్ రామకృష్ణ, జోహార్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. అదే కోవలో యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా నటించిన రొమ్కామ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది. విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. మాళవికా నాయర్, హెబ్బాపటేల్ హీరోయిన్స్గా నటించారు. కుమారి 21 ఎఫ్లో సూపర్బ్ కెమిస్ట్రీతో హిట్ పెయిర్గా నిలిచిన రాజ్తరుణ్, హెబ్బాపటేల్ మరోసారి ఈ చిత్రంలో సందడి చేయనున్నారు. ఫన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమైంది. అతి తక్కువ సమయంలోనే ఆహా ఓటీటీ ఎంటర్టైన్మెంట్ పరంగా తెలుగు…