మిల్కీ బ్యూటీ తమన్నా 2026లో తన ఫోకస్ను పూర్తిగా బాలీవుడ్ వైపు మళ్లించడం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. దశాబ్ద కాలం పాటు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలిగిన ఆమె, ప్రస్తుతం షాహిద్ కపూర్తో ఓరోమియో, సిద్ధార్థ్ మల్హోత్రాతో వాన్, అజయ్ దేవగన్-సంజయ్ దత్ కలయికలో వస్తున్న రేంజర్ వంటి భారీ హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ ఏడాది ఆమె డైరీ మొత్తం బాలీవుడ్ సినిమాలతోనే నిండిపోవడంతో, 2026ని ఆమె తన ‘హిందీ ఇయర్’గా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. దక్షిణాది సినిమాలకు తమన్నా గ్యాప్ ఇవ్వడం వెనుక బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆమె చేసిన చివరి చిత్రాలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడం ఒక కారణమైతే, బాలీవుడ్ మేకర్స్ ఆమెకు వైవిధ్యమైన పాత్రలు మరియు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం మరో ప్రధాన కారణం. కేవలం వెండితెరపైనే కాకుండా, హిందీ…
