“మాఊరి పొలిమేర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’ పొలిమేర చిత్రానికి సీక్వెల్ ఇది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరికృష్ణ నిర్మాత. నవంబరు 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. చిత్ర దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. సాధారణంగా భారీ చిత్రాలకు మాత్రమే సీక్వెల్ చేస్తుంటారు. కానీ మీరు మా ఊరి పొలిమేర లాంటి చిన్న చిత్రానికి సీక్వెల్ చేయడానికి కారణం ? కథ రాసుకున్నప్పుడే తప్పనిసరిగా సీక్వెల్ చేద్డామని అనుకున్నం. కథలో వున్న సీరియస్ నెస్, ఇంకా చెప్పాలనుకున్న కథ మిగిలిపోవడంతో పార్ట్ 2లో…