ప్రముఖ నిర్మాత , స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ తొలిసారిగా తమిళంలో నిర్మించిన చిత్రం ‘కిడ’ . తెలుగులో దీపావళి పేరుతో అనువదించారు.ఆర్.ఎ.వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పూ రాము, కాళీ వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రమిది. దీపావళి పండగ సందర్బoగా నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆర్.ఎ.వెంకట్ మాట్లాడుతూ… * మీ నేపథ్యమేంటి? – మాది తమిళనాడు..మధురై జిల్లాలోని రామనాథపురం అనే గ్రామం. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్నప్పుడే నాన్నగారు చనిపోయారు. తాతయ్య, నాన్నమ్మ, అమ్మ వాళ్లే నన్ను పెంచారు. * సినిమా రంగంలోని ఎలా అడుగు పెట్టారు? దర్శకుడు కావాలనే ఆలోచన ఎలా వచ్చింది? – సినిమా…
