డి ఎస్ ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై హాస్య నటుడు గౌతమ్ రాజు కొడుకు కృష్ణ మరియు ఆయుషి హీరో హీరోయిన్గా డి ఎస్ రాథోడ్ దర్శకత్వంలో వస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం ఈ రోజు హైదరాబాద్లోని సారధి స్టూడియోస్లో ఘనంగా ప్రారంభం అయ్యింది. తనికెళ్ళ భరణి మరియు కె ఎస్ రవి కుమార్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం హీరో హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ళ భరణి క్లాప్ ఇవ్వగా, కె ఎస్ రవి కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. అనంతరం పాత్రికేయులతో దర్శకులు డిఎస్ రాథోడ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిధులు గౌతమ్ రాజు గారికి, తనికెళ్ళ భరణి గారికి మరియు కె ఎస్ రవి కుమార్…