‘దర్జా’ చిత్రం మంచి విజయం సాధించి, చిత్రంలో చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు తీసుకురావాలని కోరారు యాక్షన్ కింగ్ అర్జున్. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలోని సునీల్ పాత్రకి సంబంధించిన మోషన్ పోస్టర్ని తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్ర మోషన్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. మోషన్ పోస్టర్ చాలా బాగుంది. ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుందని…