బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ ‘దంగల్’ చిత్రంలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు సుహానీ భట్నాగర్ . బబితా కుమారిగా ప్రేక్షకులకు చేరువైన ఆమె అరుదైన వ్యాధితో ఇటీవల మృతి చెందారు. దీనిపై తాజాగా ఆమె తల్లి పూజ మీడియాతో మాట్లాడారు. ‘మేము సుహానీ వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదు. ఆమెకు ఎంతో సపోర్ట్గా ఉండే అమీర్ ఖాన్ కు కూడా దీని గురించి చెప్పలేదు. ఇది కేవలం చర్మ సమస్య అనుకున్నాం. సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాం. చికిత్స కోసం ఎయిమ్స్లో చేర్పించాక.. డెర్మటోమయోసైటిస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఇన్ఫెక్షన్ బారిన పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆమె ప్రాణాలు విడిచింది. సుహానీ చాలా తెలివైన అమ్మాయి. చేసే ప్రతి పనిలో రాణించాలనుకునేది. తను ‘దంగల్’ చిత్రం చేయడం వల్ల తల్లిదండ్రులుగా మాకు…