‘కోర్ట్’ ఫేమ్ జోడి హర్ష్ రోషన్, శ్రీదేవి ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ అనే రొమాంటిక్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ గురువారం థియేటర్లలో విడుదలయిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందో చూద్దాం… కథ: చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్న బావా మరదళ్లు యాదగిరి (హర్ష్ రోషన్), రాజి (శ్రీదేవి). రాజి చదువులో రాణిస్తుంది, కానీ యాదగిరి స్కూల్ డ్రాపౌట్. రాజి పెరిగి పెద్దయ్యాక యాదగిరిని మర్చిపోతుంది. అయితే.. అతను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేగాక మ్యూజిక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్కు చేరుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరి యాదగిరి తన జీవితంలో విజయం సాధించి, రాజి ప్రేమని ఎలా గెలుచుకున్నాడనేదే ఈ సినిమా కథ. విశ్లేషణ: ‘బ్యాండ్ మేళం’లో మేజర్ డ్రా బ్యాక్ కథ. పాతచింతకాయ పచ్చడిలా సాగే ఈ తరహా కథలు టాలీవుడ్లో ఇప్పటికే చాలా సినిమాల్లో…
