సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో సినిమాలంటే ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. పెద్ద బ్యాకింగ్ ఉన్న సినిమాలంటే క్రేజ్ రెట్టింపు అవుతుంది. #VNRTrio- వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన తమ గత చిత్రం ‘భీష్మ’ కంటే పెద్ద విజయాన్ని అందించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. అనౌన్స్ మెంట్ వీడియో ఫన్నీగా ఉండటంతో మేకర్స్ చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ డెడ్లీ కాంబినేషన్ లోని క్రేజీ ప్రాజెక్ట్ ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది. ముహూర్తం షాట్ కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టగా, దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. గోపీచంద్…
