‘మళ్ళీ పెళ్లి’ లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి: పవిత్రా లోకేష్

'మళ్ళీ పెళ్లి' లో మంచి ఎంటర్ టైన్మెంట్ తో పాటు హై ఎమోషన్స్ ఉంటాయి: పవిత్రా లోకేష్

నవరసరాయ డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ లో పవిత్ర లోకేష్ కథానాయికగా నటిస్తున్నారు. మెగా మేకర్ ఎం ఎస్ రాజు రచన, దర్శకత్వం వహించారు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌ పై నరేష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ పెళ్లి మే 26న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవిత్ర లోకేష్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. చాలా విరామం తర్వాత ‘మళ్ళీ పెళ్లి’ లో మళ్ళీ హీరోయిన్ గా చేయడం ఎలా అనిపించింది ? నా కెరీర్ ప్రారంభం నుంచి పాత్రలపై దృష్టి పెట్టాను గానీ హీరోయిన్ గానే చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా కెరీర్ మొదట్లోనే సుప్రసిద్ధ దర్శకులు…