బి.ఎన్.కె ఎంటర్టైన్మెంట్స్లో ప్రొడక్షన్ నెం.1గా రూపుదిద్దుకుంటోన్న చిత్రం గురువారం ప్రముఖుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఎంతో వైభవంగా ప్రారంభమైంది. మనోజ్ ఎల్లు మహంతి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంతో ప్రదీప్ విరాజ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. ఆయన సరసన దివ్య ఖుష్వా హీరోయిన్గా నటించనుంది. లవ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బిఎన్కె (బంగారు నవీన్ కుమార్) భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ చిత్ర పూజా కార్యక్రమాలలో ముహుర్తపు సన్నివేశానికి సక్సెస్ఫుల్ నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా క్లాప్ కొట్టగా.. సీనియర్ దర్శకుడు వి. సముద్ర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. బిజినెస్మ్యాన్ రామ్ ఎర్రమ్ స్క్రిప్ట్ని చిత్రయూనిట్కు అందించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత బి.ఎన్.కె మాట్లాడుతూ.. ముందుగా మా తొలి…
