వైభవంగా ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు : ప్రారంభించిన రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి

http://tollywoodtimes.in/wp-content/uploads/2022/11/School.tif

ఎంతో ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లోని ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కన్నులపండువగా జరిగాయి. ఈ ‘గీతాంజలి దేవ్ శాల’ రజతోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల ప్రాంగణంలో శనివారం విద్యార్థినీ విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలు ప్రతీ ఒక్కరికీ మరపురాని అనుభూతని కలిగించాయి. ఈ సందర్బంగా ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ…విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో వస్తున్న పలు నూతన సాంకేతికతను ఉపయోగించుకొని విజ్ఞాన విహారంలో తెలియాడాలని, ఈ విషయంలో ప్రతీ విద్యార్థినీ విద్యార్థులు ఎంతో ముందుండాలని కోరారు. మనదేశంలొ విద్యను అభ్యసించిన భారతీయులు ప్రపంచ దేశాల్లో ఉన్నత మైన స్థానాలో వున్నారన్న విషయాన్ని మంత్రి మల్లారెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసారు. బ్రిటన్ ప్రధాని భారతీయులు కావడం…