టెంపుల్ మీడియా పతాకం పై దర్శకులు సి .జగన్మోహన్ (మనకు సుపరిచితమైన మాయాబజార్ జగన్మోహన్) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘S99.’ యాక్షన్ అండ్ త్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యతీష్ అండ్ నందిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ టైటిల్ ను రమేశ్ ప్రసాద్ గారు ఆవిష్కరించి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రమేష్ ప్రసాద్ గారు మాట్లాడుతూ… మా నాన్నగారు సినిమాని చాలా ఇష్టపడేవారు, సినిమాల కోసం మా నాన్నగారు చాలా కష్టపడ్డారు, అదే నన్ను ఉత్సాహపరిచింది. సినిమా కోసం పని చేయాలి అనుకున్న. అందుకోసమే నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా, ప్రపంచవ్యాప్తంగా ప్రసాద్ ల్యాబ్స్ ను నిర్మించాను. సినిమా అంటే ఒక అద్భుతం కానీ ఇప్పుడు సినిమాలు థియేటర్లో సరిగ్గా ఆడటం లేదు.. కానీ సినిమాల కోసం…
