పాన్ ఇండియా హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్యమీనన్ జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘స్పై’ థియేట్రికల్ ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గురువారం సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదలైన ఈ ట్రైలర్.. యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతోంది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఇప్పుటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై మంచి హైప్ను క్రియేట్ చేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రతి భారతీయుడికి గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. సాంకేతికంగా, యుద్ధ సన్నివేశాల పరంగా సినిమా ఎంత గ్రాండియర్గా ఉండబోతోందో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. నిఖిల్ యాక్షన్కు తోడు దగ్గుబాటి రానా కూడా ట్రైలర్…
