ఓటింగ్ ద్వారా తెలుగు ప్రజలంతా సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి!! పెగాసిస్ వారు నిర్వహిస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబల్ ` ఫైనల్స్ కు సెలక్ట్ అయ్యారు సినీనటి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేరళలోని కొచ్చిలో ఫైనల్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి `మిసెస్ ఇండియా గ్లోబల్ కు సెలక్ట్ అయిన అంకిత ఠాకూర్ ఈ రోజు ఫిలించాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో `మిస్ ఏసియా` రష్మి ఠాకూర్, తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ…“తెలంగాణ కు ప్రాతినిధ్యం వహిస్తూ `మిసెస్ ఇండియా గ్లోబల్ ఫైనల్స్ కు చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రజలంతా ఓటింగ్ ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కొచ్చీలో ఈ నెల…
