తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22 : టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ డా.పతాని రామకృష్ణగౌడ్‌

-టీఎఫ్‌సీసీ ఛైర్మన్‌ డా॥ పతాని రామకృష్ణగౌడ్‌

సినీ పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేస్తూ… టాలెంట్‌ ఉన్న వారికి గుర్తింపునివ్వడంలో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఎప్పుడూ ముందుంటుంది. సినీ పరిశ్రమలోని నటీ నటులతోపాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు ‘టీఎఫ్‌సీసీ- నంది అవార్డ్స్‌’ ద్వారా గుర్తింపును ఇవ్వనుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా 10,000 మంది సభ్యులతో టీఎఫ్‌సీసీ కొనసాగుతుంది. టిఎఫ్‌సీసీ నిర్వహించే ‘టీ ఎఫ్‌సీసీ-నంది అవార్డ్స్‌’ కార్యక్రమం వచ్చే ఉగాది పండుగ రోజున భారీ స్థాయిలో నిర్వహించనుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైౖర్మన్‌ డా॥ పతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ..‘ తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ -నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22’ ఉగాది రోజున నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, మలయాళం హీరో…