జీ 5 ఏటీఎం ట్రైల‌ర్‌.. ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

జీ 5 ఏటీఎం ట్రైల‌ర్‌.. ఆక‌ట్టుకుంటోన్న యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ హరీష్ శంక‌ర్ క్రియేట్ చేసిన సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘ఏటీఎం’ జనవరి 20 నుంచి జీ 5లో ప్రీమియర్ కానుంది. దిల్ రాజు ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సిరీస్ ట్రైల‌ర్‌ను మేకర్స్ విడుద‌ల చేశారు. జ‌గ‌న్ (బిగ్ బాస్ తెలుగు విజేత వి.జె.స‌న్నీ), పోలీస్ ఆఫీస‌ర్ (సుబ్బ‌రాజ్ ) మ‌ధ్య జ‌రిగే యుద్ధ‌మే ఏటీఎం. దోపిడి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ క్రైమ్ డ్రామాలో రియ‌లిస్టిక్ యాక్ష‌న్‌, రా ఎలిమెంట్స్ ఇత‌ర ఎలిమెంట్స్ అన్నీ మిళిత‌మై ఉన్నాయి. ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే జ‌గ‌న్ పాత్ర‌ధారి మ‌నిషి ఎద‌గ‌డానికి స‌రైన మార్గం.. త‌ప్పుడు మార్గాల గురించి మాట్లాడుతాడు. అత‌డు ద‌ర్జాగా, విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌టానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నాడనేదే క‌థాంశం. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో దీన్ని ఎంగేజింగ్‌గా తెర‌కెక్కించారు. న‌లుగురు కుర్రాళ్లు రూ.25 కోట్ల‌ను…