ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వంలో హ్రిదు హరూన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం ‘కోనసీమ థగ్స్’. సింహ, ఆర్ కె సురేష్, మునిష్ కాంత్, అనస్వర రంజన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ షిబు తమీన్స్ తనయురాలు రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో భారీ స్థాయిలో నిర్మించారు. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇటీవలే మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ ఎల్ పి పేరిట పంపిణీ రంగంలోకి కూడా ప్రవేశించారు. సంక్రాంతి కి విడుదలై ఘనవిజయం సాధించిన భారీ చిత్రాలు వాల్తేర్ వీరయ్య, వీర సింహా రెడ్డి లను నిర్మించడమే కాకుండా ఒకే సమయంలో…