రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ సహాయ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో `టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుకలు ఆగస్టు 12 న దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వటైజర్, నటుడు ఆలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ మిట్టపల్లి సురేందర్, పల్లె లక్ష్మణ్ గౌడ్,…
