‘అన్వేషి’ నుంచి ఏదో ఏదో కలవరం..పాట విడుదల

‘అన్వేషి’ నుంచి ఏదో ఏదో కలవరం..పాట విడుదల

విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల‌, సిమ్రాన్ గుప్తా, అన‌న్య నాగ‌ళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై వి.జె.ఖ‌న్నా ద‌ర్శ‌క‌త్వంలో టి.గ‌ణ‌ప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమ‌వారం ఈ సినిమా నుంచి ‘ఏదో ఏదో కలవరం’ అనే పాటను భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తోన్న సినిమాలోని ఈ పాట‌ను చైత‌న్య వ‌ర్మ రాశారు. అనురాగ్ కుల‌క‌ర్ణి, దీప్తి ప్ర‌శాంతి పాట‌ను ఆల‌పించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో… మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ ‘‘చైతన్ భరద్వాజ్ నాకెంతో ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఓ ర‌కంగా చెప్పాలంటే న‌న్నెంతో భ‌య‌పెట్టిన వ్య‌క్తి. ఇత‌నేంట్రా ఇలా చేస్తున్నాడు. మ‌న ప‌రిస్థితేంటి? అని చాలా సార్లు అనుకున్నాను. పిల్లా రా.., చుక్క‌ల చున్నీ.., బుజ్జీ…