ఇటీవల వచ్చిన రజనీకాంత్ ‘జైలర్’లో విలన్ పక్కన కీలక పాత్రలో నటించిన కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ అయిన మారిముత్తు (58) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఓ టీవీ సీరియల్కు డబ్బింగ్ చెబుతూ.. ఆయన సడెన్గా కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడున్న సిబ్బంది ఆస్పత్రికి తరలించగా అప్పటికే మారిముత్తు కన్నుమూసినట్లుగా వైద్యులు గుర్తించారని సమాచారం. మారిముత్తు ప్రస్తుతం చేస్తున్న ‘ఎథిర్ నీచెల్’ అనే టీవీ సీరియల్కు డబ్బింగ్ చెప్పడానికి శుక్రవారం ఉదయం డబ్బింగ్ స్టూడియోకు వచ్చారని, డబ్బింగ్ చెబుతూనే గుండెపోటుతో కుప్పకూలిపోయారని.. డబ్బింగ్ స్టూడియో సిబ్బంది చెబుతున్నారు. జి. మారిముత్తు ఇప్పటి వరకు వందకుపైగా సినిమాల్లో నటించారు. కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా ఇలా అనేక రకాల పాత్రలలో ప్రేక్షకులని అలరించారు. అజిత్ హీరోగా ఎస్జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాలి’సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మారిముత్తు.. రీసెంట్గా వచ్చిన రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలో విలన్కు నమ్మినబంటు పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కమల్హాసన్ ‘ఇండియన్ 2’లోనూ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మారిముత్తు స్వతహాగా దర్శకుడు కూడా కావడంతో నటుడిగా మంచి గుర్తింపును పొందారు. కోలీవుడ్ డైరెక్టర్స్ ఆయన కోసం ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారంటే.. మారిముత్తు నటనకున్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవచ్చు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...