టాలీవుడ్, బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత సత్యభామ అంటూ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది. అయితే ఈ భామ తాజాగా మరో బంఫరాఫర్ కొట్టినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లోకాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు- తెలుస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో కాజల్ రావణుడి భార్య మండోదరి పాత్రలో కనిపించనున్నారు. నితీష్ తివారి ’రామాయణ’ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి నటీనటుల ఎంపికపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఖరారయ్యారు. ఇప్పుడు మండోదరి పాత్ర కోసం కాజల్ అగర్వాల్ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ఆమె నటనకు మంచి గుర్తింపు ఉంది.’మగధీర’,’డార్లింగ్’,’బృందావనం’ వంటి తెలుగు చిత్రాలతో పాటు,’సింగం’, ‘స్పెషల్ 26’ వంటి హిందీ చిత్రాల్లోనూ ఆమె తన ప్రతిభను చాటు-కున్నారు. ఇప్పుడు ’రామాయణం’ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో మండోదరి వంటి బలమైన పాత్రలో ఆమె ఎలా మెప్పిస్తారో చూడాలి. మండోదరి పాత్ర రామాయణంలో ఒక ముఖ్యమైన పాత్ర. రావణుడి పట్టపురాణిగా ఆమె రావణుడికి మంచి సలహాలు ఇస్తూ, ధర్మం వైపు నిలబడే ప్రయత్నం చేస్తుంది. తన భర్త తప్పులను ఎత్తిచూపుతూ, సీతను తిరిగి రాముడికి అప్పగించాలని సూచిస్తుంది. కాబట్టి, ఈ పాత్రకు కాజల్ వంటి అనుభవం ఉన్న నటి అయితే మరింత న్యాయం చేకూరుస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, కాజల్ అగర్వాల్ కెరీర్లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు. నితీష్ తివారి ‘రామాయణం’ మూడు భాగాలుగా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటు-ందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతికతతో ఈ చిత్రం రూపొందనుంది.
రామాయణంలో మండోదరిగా కాజల్ ?
