* ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది “ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి” అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో ‘అగధ’ టీజర్ మొదలవుతుంది. మొత్తం ఈ టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు. ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా, అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది. ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ , భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు,…
Category: FILM NEWS
తేజేష్ రాజన్ హీరోగా ‘అమరం’ మూవీ ఇంటెన్స్ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్
తేజేష్ రాజన్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం అమరం, తిరుఅరుల్ కృష్ణన్ దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. ఇంటెన్స్ యాక్షన్ తో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఓ ట్రైబల్ స్మగ్లర్, కిల్లర్, ఓ యువతి ప్రయాణం చుట్టూ తిరిగే కథ ఇది. ఎర్రచందనం స్మగ్లర్ల జీవనశైలి, వారు ఎదుర్కొనే కష్టాలు, ప్రమాదాలు, వారి ప్రపంచంలో దాగి ఉన్న వాస్తవాలను కూడా బలంగా ప్రతిబింబిస్తుంది. ఈస్ట్రన్ ఘాట్స్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ సినిమా అక్కడి సామాజిక సమస్యలను కూడా బలంగా ప్రజెంట్ చేస్తోంది.వెస్ట్రన్ ఘాట్స్లో కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించగా, కడప పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. దాదాపు 200 మందికి పైగా పాల్గొన్న ప్రత్యేక యాక్షన్ బ్లాక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. బాంబేకు చెందిన మార్షల్…
నితిన్ చిత్రం ప్రారంభం
ప్రముఖ కథానాయకుడు నితిన్ తదుపరి ఆసక్తికరమైన చిత్రం సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైంది. నాణ్యమైన, విజయవంతమైన చిత్రాలను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ప్రతిభావంతులైన దర్శకులు నారి సిరిసవాడ మరియు సోమశేఖర్ టి దర్శకత్వం వహిస్తున్నారు. బలమైన సృజనాత్మక బృందం ఏకమవ్వడంతో, ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర…
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం : నిర్మాత ఆర్.బి చౌదరి మృతి
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, తమిళ్ హీరో జీవా తండ్రి ఆర్. బి. చౌదరి మరణించారు. మంగళవారం ఉదయ్ పూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దీంతో ఒక్కసారిగా చిత్రసీమ దిగ్బ్రాంతికి గురైంది. ఆర్. బి. చౌదరి పూర్తిపేరు.. రతన్ లాల్ భగత్ రామ్ చౌదరి. ఆయన చిత్రపరిశ్రమలోకి రాకముందు ఉక్కు ఎగుమతులు, ఆభరణాల పరిశ్రమలో పనిచేశారు. 1989లో ఆర్.బి.చౌదరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మలయాళంలో పలు సినిమాలు చేశాక.. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ ను స్థాపించి తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 99 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం సూపర్ గుడ్ ఫిల్మ్స్ లో 100వ సినిమాగా ‘మకుటం’ తెరకెక్కుతోంది. విశాల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం సెట్స్ పై ఉంది. ముఖ్యంగా తెలుగులో…
M4M Movie Trailer Review : ది న్యూ ట్రెండ్ సెట్టర్
* కిల్లర్ ఎవరో గెస్ చేస్తే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు బహుమతి ‘వాడు సామాన్యుడు కాదు.. కేర్ ఫుల్…’అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ‘ఎం4ఎం’ (మోటీవ్ ఫర్ మర్డర్) మూవీ ట్రైలర్ ఇండస్ట్రీలో ది న్యూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల…
‘పెద్ది’ని టార్గెట్ చేస్తున్నారా?
* టాలీవుడ్ ని కుదిపేస్తున్న ‘పెద్ది’ సమస్య.. టాలీవుడ్ లో ఇప్పుడు ‘పెద్ది’ సినిమా చర్చగా మారింది. థియేటర్ల సమస్య అటు తిరిగి ఇటు తిరిగి పెద్ది సినిమాకు లింక్ అవుతుంది. టాలీవుడ్ నిర్మాతల మధ్యే విబేధాలు కూడా వచ్చాయి. దీంతో టాలీవుడ్ నిర్మాతలు చర్చల్లో మునిగారు. గతంలో ఏపీలోని పలు థియేటర్స్ ఎగ్జిబిటర్లు తమకు సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే రిలీజ్ చేయాలని, రెంటల్ విధానం వద్దని లేకపోతే థియేటర్స్ బంద్ చేస్తామని పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా సమయంలో హడావిడి చేసారు. అప్పట్లో ఇది పెద్ద సమస్యే అయింది. పవన్ సినిమాని టార్గెట్ చేసి కొంతమంది నిర్మాతలే కావాలని చేస్తున్నారు అని టాక్ నడిచింది. ఆ నిర్మాతలపై విమర్శలు కూడా వచ్చాయి. అయితే అప్పటికి ఏదో మాట్లాడి చివరి నిమిషంలో ఎగ్జిబిటర్లను కూల్ చేసారు.…
‘Police Complaint’ starring Varalaxmi Sarathkumar and Naveen Chandra to hit theatres on May 22
The upcoming horror–action thriller Police Complaint, starring Varalaxmi Sarathkumar and Naveen Chandra in lead roles, is all set for a grand theatrical release on May 22. Directed by Sanjeev Megoti and produced by Balakrishna Maharana under the MSK Pramidha Shree Films banner, the film is already creating strong buzz in the industry. Known for her powerful performances in both villainous and character-driven roles, Varalaxmi Sarathkumar will be seen in a new shade in this film, while Naveen Chandra appears in a versatile and intense role. Their combination is expected to…
మే 22న థియేటర్లలోకి వరలక్ష్మి, నవీన్ చంద్రల ‘పోలీస్ కంప్లైంట్’
▪️ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో హారర్–యాక్షన్ థ్రిల్లర్ ▪️ నటుడు కృష్ణసాయి బర్త్డే సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్ విడుదల ▪️ 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో భారీ స్థాయిలో నిర్మాణం ▪️ వరలక్ష్మి శరత్కుమార్ కొత్త షేడ్స్ – నవీన్ చంద్ర వెర్సటైల్ రోల్ ▪️ విభిన్న కథ, పవర్ఫుల్ పాత్రలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్ఫుల్ నటనతో స్క్రీన్పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవీన్ చంద్ర. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సరికొత్త, భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్లో డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన తాజా చిత్రం…
‘జెట్లీ’ రోరింగ్ టేక్ ఆఫ్ మీట్
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, రితేష్ రానా సమ్మర్ బ్లాక్ బస్టర్ ‘జెట్లీ’. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పించింది. మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేసింది. వెన్నెల కిషోర్, అజయ్ కీలక పాత్రలు పోషిసించారు. మే 1న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ రోరింగ్ టేక్ అఫ్ మీట్ నిర్వహించారు. రోరింగ్ టేక్ ఆఫ్ మీట్లో డైరెక్టర్ రితేష్ రానా మాట్లాడుతూ.. చెర్రీ గారిని కలసి పదేళ్లు అవుతోంది. ఆయనకి మొదట ‘మత్తు వదలరా’ స్టోరీ చెప్పాను.మా టీమ్ అందరినీ నమ్మి మాకు…
మ్యూజికల్ ఫాంటసీ : ‘సింగ్ గీతం’ జూన్ 11న రిలీజ్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం ‘పుష్పక్’ నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ‘ఆదిత్య 369’ వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్తో ఆయన చేసిన ‘విచిత్ర సహోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజన్’ బెంచ్ మార్క్ సినిమాలుగా నిలిచాయి. ఇప్పుడు, భారతదేశపు మొట్టమొదటి మ్యూజికల్ ఫాంటసీగా రూపొందించిన ‘సింగ్ గీతం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రం సంగీతం, మ్యాజికల్ రియలిజంను మేళవించి ఓ యూనిక్ అనుభూతిని అందిస్తుంది. వైజయంతి మూవీస్, స్వప్న…
