ప్రముఖ నటులు , నిర్మాత మురళీమోహన్ తన 61 వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్ “లో అంద విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన మరియు తన కుటుంబ సభ్యుల జన్మదిన వేడుకలను లేదా వివాహ వార్షికోత్సవాలను దేవనార్ బ్లైండ్ స్కూల్లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకునే ఆనవాయితీని ప్రతి సంవత్సరము పాటిస్తుంటారు మురళీమోహన్. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈ రోజు దేవనార్ బ్లైండ్ స్కూల్లోని అంధ విద్యార్థుల సమక్షంలో తన 61వ వివాహ దిన మహోత్సవాన్ని జరుపుకున్నారు మురళీమోహన్. ఈ సందర్భంగా స్కూలులో జరిగిన సభా కార్యక్రమంలో మురళీమోహన్ తో పాటు ప్రముఖ గాయకుడు – సంగీత దర్శకుడు – భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ గంగాధర శాస్త్రి, దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆయన సతీమణి జ్యోతి గౌడ్,…
Category: Lifestyle
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పెంపు
హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో-252, దానికి సవరణగా తీసుకొచ్చిన జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్తో పాటు మరికొందరు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అక్రిడిటేషన్కు సంబంధించిన అన్ని సౌకర్యాలను యథావిధిగా కొనసాగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రస్తుతం అమలులో ఉన్న కార్డుల గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ,…
‘ఇసకపట్నం’ట్రైలర్ విడుదల
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు…
రాక్స్టార్ అనిరుధ్ … కొత్త అధ్యాయానికి శ్రీకారం!
సంగీత సంచలనం..రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన ఈ ట్రాక్తో అనిరుధ్ తన సంగీత ప్రపంచంలోని పరిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుధ్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్ వన్ వంటి పలు బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్…
ఉర్రూతలూగించిన “కహర్వా” సంగీతం
మృదుల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కహర్వా 2026 సంగీత నివాళి విశేషంగా ఆకట్టుకుంది. ముంబయి నుంచి వచ్చిన ప్రముఖ గాయకుడు మహమ్మద్ వకీల్, హైదరాబాద్ గాయకుడు రవి నిశేష్ కలసి మరపురాని సంగీత ప్రదర్శనతో మైమరపించారు. మృదుల శ్రీవాస్తవ జన్మ దినోత్సవం సందర్బంగా శనివారం సాయంత్రం బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో కహర్వా 2026 సంగీత వేడుక కనుల పండువగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన తొలి ద్వంద్వ పౌరసత్వం పొందిన పారిశ్రామికవేత్త కళాపోషకులు ఇఫ్తేకార్ షరీఫ్ జ్యోతి ప్రకాశనం చేసి, మృదుల చిత్రపటానికి పూలదండ సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీర్ జారా బాలీవుడ్ సినిమా ఫేమ్ గాయకుడు, జీటివి మెగా ఫైనల్ విన్నర్ మహమ్మద్ వకీల్ తనకు గుర్తింపు ఇచ్చిన తొలి ఆల్బమ్ లోని “యే కసక్ దిల్ కీ దిల్ మే”…
Excited “Kaharwa” music : Veer Jara Vakil, Nishesh impressed by Hindustani music
Kaharwa 2026 musical tribute organized by Mridula Memorial Foundation was particularly impressive. Famous singer from Mumbai Mr Mohammad Vakil and Hyderabad singer Mr Ravi Nishesh mesmerized with an unforgettable musical performance. On the occasion of Mridula Srivastava’s birth anniversary, the Kaharva 2026 music festival was organized at Bhaskara Auditorium of BM Birla Science Center on Saturday evening. Mr Iftekhar Sharif, the first dual-citizen industrialist who was the chief guest lighting the Jyoti and started the programme by offering a garland to Smt Mridula’s portrait. Vibhavari started with the song “Yeh…
మెగా హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ ?
టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమాతో గొప్ప ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్న ఆయన, గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను తిరస్కరించినట్లు తెలుస్తోంది. టాప్ నిర్మాతలు సంప్రదించినా .. సరైన కథ కోసం వేచి చూసిన వైష్ణవ్, ఎట్టకేలకు తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో సుధీర్ బాబుతో ‘హంట్’ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహేష్.ఎస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ చెప్పిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని…
Prominent Producer Allu Aravind Shows His Generosity
Allu Aravind, renowned film producer and head of Geetha Arts, has demonstrated his generosity by donating ₹30 lakh to the All India Kapu, Telaga, Balija Sangham (AITKB Sangham) at Lower Tank Bund, Hyderabad. The donation has been made for the construction of a room in the Sangham building in memory of his father, Allu Ramalingaiah. Through this contribution, Allu Aravind has extended his support toward the welfare and upliftment of the Kapu, Telaga, Balija, and Ontari communities, as well as various social service initiatives carried out by the organization. The…
మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్బండ్లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం నాయకులైన ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్,…
శ్రీనివాస మంగపురం నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయగా, తాజా టీజర్ మాత్రం పూర్తిగా యాక్షన్, ఆటిట్యూడ్తో ఆకట్టుకుంది. జయకృష్ణ ఘట్టమనేని కాన్ఫిడడెంట్ గా విలన్స్ ని సవాల్ చేస్తూ, భారీ యాక్షన్ సన్నివేశాల్లో అలరించారు. టీజర్…
