టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమాతో గొప్ప ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్, ఆ తర్వాత వచ్చిన ‘కొండపొలం’, ‘రంగ రంగ వైభవంగా’, ‘ఆదికేశవ’ చిత్రాలతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో కథల ఎంపికలో చాలా జాగ్రత్త పడుతున్న ఆయన, గత మూడేళ్లలో దాదాపు 100కు పైగా స్క్రిప్ట్లను తిరస్కరించినట్లు తెలుస్తోంది. టాప్ నిర్మాతలు సంప్రదించినా .. సరైన కథ కోసం వేచి చూసిన వైష్ణవ్, ఎట్టకేలకు తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. గతంలో సుధీర్ బాబుతో ‘హంట్’ అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహేష్.ఎస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహేష్ చెప్పిన కథ వైష్ణవ్కు బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ఓకే అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని…
Category: Lifestyle
Prominent Producer Allu Aravind Shows His Generosity
Allu Aravind, renowned film producer and head of Geetha Arts, has demonstrated his generosity by donating ₹30 lakh to the All India Kapu, Telaga, Balija Sangham (AITKB Sangham) at Lower Tank Bund, Hyderabad. The donation has been made for the construction of a room in the Sangham building in memory of his father, Allu Ramalingaiah. Through this contribution, Allu Aravind has extended his support toward the welfare and upliftment of the Kapu, Telaga, Balija, and Ontari communities, as well as various social service initiatives carried out by the organization. The…
మంచి మనసు చాటుకున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ మంచి మనసు చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో గల ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం (AITKB Sangham) కు భారీ విరాళం అందించారు. తన తండ్రి కీ.శే. పద్మశ్రీ డా. అల్లు రామలింగయ్య పేరిట లోయర్ ట్యాంక్బండ్లోని సంఘ భవనంలో ఒక గది నిర్మాణానికి 30 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ఈ విరాళంతో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల అభ్యున్నతికి, సామాజిక సేవకు అల్లు అరవింద్ ముందుకొచ్చారు. ఈ సంఘ భవనం ద్వారా విద్యార్థులకు, నిరుపేదలకు, సమాజానికి జరిగే సేవల్లో అల్లు అరవింద్ సహకారం ఎప్పటికీ నిలిచిపోనుంది. ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘం నాయకులైన ఏవీ రత్నం, కోటేల శ్రీహరి, అరవ రామకృష్ణ, బైరా దిలీప్,…
శ్రీనివాస మంగపురం నుంచి యాక్షన్ ప్యాక్డ్ టీజర్
‘ఆర్ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాలతో భారీ బ్లాక్బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్ను విడుదల చేశారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయగా, తాజా టీజర్ మాత్రం పూర్తిగా యాక్షన్, ఆటిట్యూడ్తో ఆకట్టుకుంది. జయకృష్ణ ఘట్టమనేని కాన్ఫిడడెంట్ గా విలన్స్ ని సవాల్ చేస్తూ, భారీ యాక్షన్ సన్నివేశాల్లో అలరించారు. టీజర్…
ఎస్తర్ నోరోన్హా హీరోయిన్ గా హారర్ కామెడీ థ్రిల్లర్
ఎస్తర్ నోరోన్హా కథానాయికగా ఎస్.కె గోపాల్ దర్శకత్వంలో బ్లూ రే సర్క్యూట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా నిర్మితమవుతున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. హీరోయిన్ గా నూపూర్ ముఖర్జీ నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ముగ్గురు హీరోలు.. ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తారు. సోమవారం మణికొండ శివాలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ‘సంతోషం’ ఫిలిం మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి హీరో హీరోయిన్ల పై క్లాప్ కొట్టారు. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎస్విఎన్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎక్స్ మినిస్టర్ వేణుగోపాల చారి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో…
జూన్లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్ఫామ్గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి, ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్ఫామ్గా విహారి OTT జూన్లో గ్రాండ్గా ప్రారంభం కానుంది.
‘రమణికళ్యాణం’ మంచి ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో మనసుని హత్తుకునే సినిమా
మే22న అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ట్రైలర్ & ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య వశిష్ట & టీ సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.…
ఎన్టీఆర్ నీల్ టైటిల్ ‘డ్రాగన్’
* పవర్ఫుల్ గ్లింప్స్తో మాస్ హంగామా షురూ.. ప్రపంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కు ఉన్న మాస్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కాంబోలో రూపొందుతోన్న హై ఎక్సెపెక్టెడ్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎన్టీఆర్నీల్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టైటిల్ను ‘డ్రాగన్’గా ఖరారు చేస్తూ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. 4 నిమిషాల…
స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి : లగడపాటి రాజగోపాల్, ప్రముఖ సినీనటి సన
నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మొయినాబాద్ : స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఆరోగ్యంతో పాటు అన్ని రంగాలలో నిరుద్యోగ యువత ముందుకెళ్లాలని లగడపాటి రాజగోపాల్. ప్రముఖ సినీనటి సన లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల లగడపాటి రాజగోపాల్ రెడ్డి సతీమణి జానకి నిర్మించిన తమర కన్వెన్షన్ హాలును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి నిర్వహించారు కన్వెన్షన్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్న వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లగడపాటి రాజగోపాల్ జానకి తో పాటు సినీ యాక్టర్ సనా గజల్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ…
మైమరపించిన సత్యభామ సంజయ్ నవ జనార్దన పారిజాతం
నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం హైదరాబాద్ : సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్ రఫీ, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం…
