ఎస్తర్ నోరోన్హా కథానాయికగా ఎస్.కె గోపాల్ దర్శకత్వంలో బ్లూ రే సర్క్యూట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా నిర్మితమవుతున్న కొత్త చిత్రం ప్రారంభమైంది. హీరోయిన్ గా నూపూర్ ముఖర్జీ నటిస్తోంది. ముఖ్య పాత్రల్లో ముగ్గురు హీరోలు.. ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే వివరాలు ప్రకటిస్తారు. సోమవారం మణికొండ శివాలయంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ‘సంతోషం’ ఫిలిం మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి హీరో హీరోయిన్ల పై క్లాప్ కొట్టారు. నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎస్విఎన్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఎక్స్ మినిస్టర్ వేణుగోపాల చారి స్క్రిప్ట్ అందించారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో…
Category: Lifestyle
జూన్లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ
ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్ఫామ్గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి, ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్ఫామ్గా విహారి OTT జూన్లో గ్రాండ్గా ప్రారంభం కానుంది.
‘రమణికళ్యాణం’ మంచి ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో మనసుని హత్తుకునే సినిమా
మే22న అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నాం ట్రైలర్ & ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య వశిష్ట & టీ సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్స్ గా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ రమణి కళ్యాణం. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్ పై విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి. శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మే 22న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.…
ఎన్టీఆర్ నీల్ టైటిల్ ‘డ్రాగన్’
* పవర్ఫుల్ గ్లింప్స్తో మాస్ హంగామా షురూ.. ప్రపంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్కు ఉన్న మాస్ క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ డైరెక్టర్ తెరకెక్కించిన కెజియఫ్ సిరీస్, సలార్ పార్ట్ వన్ చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ కాంబోలో రూపొందుతోన్న హై ఎక్సెపెక్టెడ్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఎన్టీఆర్నీల్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టైటిల్ను ‘డ్రాగన్’గా ఖరారు చేస్తూ ఎన్టీఆర్ పాత్రను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. 4 నిమిషాల…
స్వయం ఉపాధితో ఆర్థిక అభివృద్ధి : లగడపాటి రాజగోపాల్, ప్రముఖ సినీనటి సన
నిరుద్యోగ యువత స్వయం ఉపాధితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మొయినాబాద్ : స్వయం ఉపాధితో యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలని. ఆరోగ్యంతో పాటు అన్ని రంగాలలో నిరుద్యోగ యువత ముందుకెళ్లాలని లగడపాటి రాజగోపాల్. ప్రముఖ సినీనటి సన లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల లగడపాటి రాజగోపాల్ రెడ్డి సతీమణి జానకి నిర్మించిన తమర కన్వెన్షన్ హాలును ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా లగడపాటి రాజగోపాల్ సతీమణి జానకి నిర్వహించారు కన్వెన్షన్ ను ప్రస్తుతం నిర్వహిస్తున్న వరప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లగడపాటి రాజగోపాల్ జానకి తో పాటు సినీ యాక్టర్ సనా గజల్ శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు అనంతరం ఏర్పాటు చేసిన సన్మాన సభలో వారు మాట్లాడుతూ…
మైమరపించిన సత్యభామ సంజయ్ నవ జనార్దన పారిజాతం
నటరాజ రామకృష్ణ నృత్యరత్న తొలి జాతీయ పురస్కారంతో కళాకృష్ణకు ఘన సత్కారం హైదరాబాద్ : సత్యభామ వేషం ధరించి అతను అరుదైన దరువులు ప్రదర్శిస్తుంటే కళాప్రియుల హృదయాలు తన్మయత్వం చెందాయి. సత్యభామగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన హాంగ్ కాంగ్ కు చెందిన సంజయ్ వడపల్లి ఆంధ్ర నాట్య శైలిలో నవజనార్దన పారిజాతం ప్రదర్శించి కొన్ని కొత్త దరువులతో ఆకట్టుకున్నారు. వడపల్లి కల్చరల్, ది డ్యాన్సింగ్ బెల్స్ నృత్య సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్యం ప్రదర్శన కనుల పండువగా జరిగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, హరికథ భాగవతారిణి పద్మశ్రీ ఉమా మహేశ్వరి, కళ పత్రిక సంపాదకులు డా. మహ్మద్ రఫీ, అన్నమయ్య పరిశోధకులు డా. గంధం…
సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి : అయ్యన్నకు మద్దతుగా దళిత సంఘాల డిమాండ్
డాక్టర్ సుధాకర్ మరణానికి ముందు, మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంటికి పిలిపించి హింసించి లెటర్ రాయించుకున్నట్లు ఉన్న సంచలన వీడియోను దళిత సంఘాలు విడుదల చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెంటనే క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ ఘటనను గౌరవ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చేశారు . సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి, కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా అందించిన చంద్రబాబు నాయుడు, లోకేష్. సుధాకర్ మృతికి కారణమైన వారు బహిరంగం క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి
రాక్స్టార్ అనిరుధ్ XV టూర్ – హైదరాబాద్ లో శనివారం జరగబోయే లైవ్ కాన్సర్ట్ కి ముందుగానే ప్లాన్ చేసుకొని రావాలని కోరుతున్న నిర్వాహకులు..
* పార్కింగ్, ఎంట్రీ & ఇతర వివరాలు తెలుసుకోండి హైదరాబాద్, మార్చి 20, 2026: గచ్చిబౌలి అవుట్డోర్ స్టేడియంలో మార్చి 21 శనివారం నాడు జరగబోయే రాక్స్టార్ అనిరుధ్ XV – 15 ఇయర్స్ విత్ యూ సంగీత కచేరీకి నగరం సిద్ధమైంది. సంగీత దర్శకుడు Anirudh Ravichander తన సంగీత ప్రయాణంలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారీ కాన్సర్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ను Brand Avatar నిర్వహిస్తుండగా, TribeVibe Entertainment (BookMyShow సంస్థ) సహకారంతో, Ocean Vibes ప్రెజెంట్ చేస్తోంది. ఈ కాన్సర్ట్కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తూ, నిర్వాహకులు ప్రత్యేక పార్కింగ్ మరియు షటిల్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఎంట్రీ వివరాలు గేట్లు తెరవబడే సమయం: సాయంత్రం 4:30 గంటలకు మాత్రమే స్టేజ్ ప్రారంభం: సాయంత్రం 6:00…
వెంకన్న పాదాలు… భక్త జనాన్ని సంకటాల నుండి రక్షించే అభయ వేదాలు..
నమ్ముకున్న వారి ఇంట సిరి సౌభాగ్యాలు కురిపించే ఐశ్వర్య లక్ష్మీ చిరు నవ్వుల నాదాలు.. ఈ విషయం … తెలుగునాట తిరుమల తిరుపతి పద్మావతి అలివేలు మంగా సమే త శ్రీనివాస చరణారవింద శరణాగతులు అందరికీ అనుభవైక వేద్యమైన అనుభూతి!! స్వామి వారి శక్తికి… ఆర్త రక్షణా యుక్తికి ఎన్నో ఎన్నెన్నో నిదర్శనల ప్రదర్శనలు తెలిసినవి కొన్నే తెలియనివి ఎన్నో!! తెలుగునాట లక్షల కుటుంబాలకు ఇలవేల్పు సిరితాల్పు అయిన ఆ శేషాద్రి వాసుడు.. ఏడు కొండలవాడు..వెంకటరమణుడు….గోవిందుడు… అలానే ….తెనాలి కి చెందిన చదలవాడ వారి కుటుంబానికి కూడా ఆ ఆనందానిలయ వైకుంఠధాముడే రక్ష అని మనసా వాచా నమ్మి షోడశోపచార నవవిధ భక్తులతో అను నిమిషం కొలిచింది ఆ కుటుంబం. ఆ శ్రీనివాస వర కృపా కటాక్షానికి నిదర్శనంగా ఆ ఇంట పుట్టిన త్రిమూర్తులకు తిరుపతిరావు, వేంకటేశ్వర…
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ.. బెస్ట్ విషెస్ అందించిన టి. జి. విశ్వ ప్రసాద్, కె. ఎల్. దామోదర్ ప్రసాద్
హైదరాబాద్, మార్చి 2026: మహిళలు క్రీడల్లో మరింతగా పాల్గొనేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఉమెన్స్ క్రికెట్ లీగ్ (WCL) అధికారిక లోగో ఆవిష్కరణకు ముఖ్య అతిథి గా ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు టి.జి. విశ్వ ప్రసాద్, సినీ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఉమెన్స్ క్రికెట్ లీగ్ డైరెక్టర్ & అలా మొదలైంది సినిమా ఫేమ్ స్నిగ్ధా తో పాటు ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య, కమ్యూనిటీ కనెక్ట్ స్పోర్ట్స్ డైరెక్టర్ సందీప్ వర్మ, బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ పాల్గొని కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లా వీ ఎన్ రోజ్ వేదికగా జరిగింది. ఉమెన్స్ క్రికెట్ లీగ్ అనేది విభిన్న రంగాలకు చెందిన ప్రతిభావంతమైన మహిళలను ఒకే…
