టాలీవుడ్లో అందం అభినయంతో ఆకట్టుకొనే గ్లామర్ హీరోయిన్ లో క్యాథరిన్ త్రెసా ఒకరు.’చమ్మక్ చలో’ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి నానితో ‘పైసా’, అల్లు అర్జున్తో ‘ఇద్దరు అమ్మాయిలతో’, ‘రుద్రమదేవి’, ‘సరైనోడు’ వంటి చిత్రాల్లో నటించింది. వరుస విజయాలతో దూసుకెళ్లిన క్యాథరిన్ తెరపై కనిపించి చాలాకాలం అవుతుంది. అవకాశాలు తగ్గడంతో సైలెంట్ అయిపోయింది. సోషల్ విూడియాలో కూడా కనిపించడం లేదు. ఇక తాజాగా ఈ అమ్మడు బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమాలు, ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి నేరుగా సెట్స్ లోకి వెళ్ళిపోతారు. ఇక ముందు నుంచి వైరల్ అవుతున్నట్లుగా మెయిన్ హీరోయిన్గా నయనతార ఒకే అయిన విషయం తెలిసిందే. ఇక రెండో కథానాయికగా క్యాథరిన్ త్రెస్సా ఓకే అయ్యిందట. సెకండ్ హీరోయిన్ అయినప్పటికి చిరుతో ఒకటి రెండు పాటలు ఉండబోతున్నాయట. అయితే ఇక్కడ క్యాథరిన్ చిరుకి సంబందించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఏంటీ అంటే.. చిరంజీతో నటించే అవకాశం క్యాథరిన్ కు 2017లోనే వచ్చిందట. ‘ఖైదీ నెంబర్ 150’ కోసం వి.వి.వినాయక్ తొలుత ఆమెనే అనుకున్నారట. కానీ సుస్మితతో వచ్చిన విబేధాల కారణంగా క్యాథరిన్ని తప్పించి కాజల్ అగర్వాల్ని తీసుకున్నారట. ఇక కట్ చేస్తే తొమ్మిది సంవత్సరాల తర్వాత క్యాథరిన్ తిరిగి ఆ ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.
క్యాథరిన్ థెస్రాకు బంపర్ ఆఫర్!
