హాట్‌ టాపిక్‌ గా చిరంజీవి ఘాటు వ్యాఖ్యలు!

Chiranjeevi's sharp comments as a hot topic!

బాబీ దర్శకత్వంలో చిరంజీవి రవితేజ నటించిన చిత్రం ’వాల్తేరు వీరయ్య’ సినిమా కొన్ని థియేటర్లలో 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా… చిత్రబృందమంతా వేడుక చేసుకుంది. ఈ సందర్భంగా మైకందుకున్న మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవును… ప్రత్యేకంగా ఎవరినైనా ఉద్దేశించి అంటున్నారనే విషయంలో పూర్తి స్పష్టత లేనప్పటికీ… తాజాగా ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా…యాక్టర్ల రెమ్యూనరేషన్‌ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, ఉద్యోగ`ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలని చిరంజీవిఅన్నారు. ఇదే సమయంలో… పేదవారి కడుపునింపే దిశగా ఆలోచించాలి.. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేగానీ, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమపై పడతారేంటి? అని చిరంజీవి స్పందించారు. అనంతరం ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర విజయం…

‘ఖుషి’ ప్రమోషన్స్‌లో పాల్గొననున్న సమంత

Samantha will participate in the promotions of 'Khushi'

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ’ఖుషి’ చిత్రం సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. చాలా నెలల క్రితమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా సమంత అనారోగ్య కారణాల వల్ల షూటింగ్‌ ఆలస్యం అయింది. విడుదలకు ఇన్నాళ్ల సమయం పట్టింది. సినిమా విడుదల విషయంలో ఎలాంటి డౌట్‌ లేదు.. కానీ సినిమా విడుదల సమయంలో ప్రమోషన్స్‌ కి సమంత హాజరు అయ్యేనా లేదా అనేది గత కొన్ని రోజులుగా సస్పెన్స్‌ గా ఉంది. ఎందుకంటే సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకుంటున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా చికిత్స నిమిత్తం సమంత విదేశాలకు వెళ్లబోతుందనే వార్తలు వస్తున్నాయి. ’ఖుషి’ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో సమంత పాల్గొనే అవకాశాలు లేవని అంతా భావించారు. కానీ తాజాగా…

బాలీవుడ్‌కు బన్నీ ‘నో’ అంటున్నాడు!

Bunny says 'No' to Bollywood!

‘అల వైకుంఠపురం లో..’ సినిమాతో రికార్డు సృష్టించి.. ‘పుష్పతో ఏకంగా పాన్‌ ఇండియా స్థాయిలో రికార్డులు కొల్లగొట్టి తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. ఇప్పుడు ఆయన సినిమా కోసం యావత్‌ సినీ లవర్స్‌ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. రెండేళ్ల కిందట విడుదలైన ‘పుష్ప’ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఎలాంటి ప్రమోషన్‌లు లేకుండానే హిందీ బెల్ట్‌పై వంద కోట్ల బొమ్మతో నార్త్‌ ఆడియెన్స్‌తో జైజైలు కొట్టించుకున్నాడు. ప్రస్తుతం బన్నీ ’పుష్ప`2’తో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత బన్నీ, త్రివిక్రమ్‌తో చేతులు కలుపుతున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లే చాన్స్‌ ఉంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా బన్నీ…

ఆలియా భట్‌ హాలీవుడ్‌ ఎంట్రీ!

Alia Bhatt's Hollywood entry!

బాలీవుడ్‌ లో స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్‌. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ’ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ద్వారా అలియా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఈ చిత్రంలో సీత పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు హాలీవుడ్ లో తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉంది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ’హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో మొదటిసారి ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమా ఆగస్టు 11న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా అలియా భట్‌ తన సహ నటులు గాల్‌ గడోట్‌, జేవిూ డోర్నన్‌ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా హాలీవుడ్‌ నటి గాల్‌కు తెలుగు నేర్పించే…

అభిమానిని కూల్‌ చేసిన మిల్కీ బ్యూటీ!

The milky beauty that made the fan cool!

సెలబ్రెటీలు బయటకు వెళ్తే ఎవరో ఒకరు సెల్ఫీ అని లేదా మరేదైనా కారణం చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడేందుకు, టచ్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ బౌన్సర్‌ లు లేకుండా బయటకు అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. చుట్టూ ఎంత మంది బౌన్సర్‌ లు ఉన్నా కూడా కొన్ని సార్లు హీరోయిన్స్‌ కి అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకు అదే పరిస్థితి ఎదురైంది. ఒక కార్యక్రమంకు హాజరు అయిన మిల్కీ బ్యూటీ తమన్నా ను ఫ్యాన్‌ ఒకరు దూసుకు వచ్చి పట్టుకున్నాడు. ఆమె చేయి పట్టుకోవడంతో పాటు ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా తమన్నా షాక్‌ అయినట్లుగా ఫేస్‌ పెట్టింది. అంతే కాకుండా ఆమె భపడిరది. బారీకేడ్లు దూకి వచ్చిన అభిమానిని బౌన్సర్‌ లు తోసేందుకు…

9న రానున్న ‘ఖుషీ’ ట్రైలర్‌!

'Khushi' trailer to come on 9!

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ’ఖుషి ’. నిన్ను కోరి, మజిలీ, టక్‌ జగదీష్‌ చిత్రాల ఫేమ్‌ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్‌ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తికాగా.. సెప్టెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే మేకర్స్‌ ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌తోపాటు ’నా రోజా నువ్వే’ ’ఆరాధ్య’ ’ఖుషి’ అంటూ సాగే పాటలకు సోషల్‌విూడియాలో మంచి స్పందన లభిస్తున్నది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ అప్‌డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని విజయ్‌, సమంత ఫ్యాన్స్‌ వేయి కళ్లతో ఎదురు చేస్తున్న ట్రైలర్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. ఆగష్టు 9న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌…

‘రానా నాయుడు’ సెకండ్‌ సీజన్‌కు రెడీ!

'Rana Naidu' is ready for the second season!

విక్టరీ వెంకటేష్‌, రానా ఇద్దరు దగ్గుబాటి హీరోలు కలిసి చేసిన వెబ్‌ సీరీస్‌ రానా నాయుడు. నెట్‌ ప్లిక్స్‌ వారు నిర్మించిన ఈ సీరీస్‌ నార్త్‌ సైడ్‌ ఆడియన్స్‌ని బాగా మెప్పించింది. కొద్దిగా అడల్ట్‌ డోస్‌ ఎక్కువైందన్న కామెంట్స్‌ వచ్చినా అది హిందీ ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు. అయితే తెలుగులో వెంకటేష్‌ కి ఉన్న ఇమేజ్‌ వల్ల రానా నాయుడు సీరీస్‌ లో ఆ పాత్రను డైజెస్ట్‌ చేసుకోలేకపోయారు. అయితే రానా నాయుడు సీజన్‌ 1 సూపర్‌ సక్సెస్‌ అవడంతో సీజన్‌ 2ని కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రానా నాయుడు సీజన్‌ 2 సినిమా కోసం వెంకటేష్‌, రానా రెమ్యునరేషన్‌ ఎక్కువ డిమాండ్‌ చేసినట్టు తెలుస్తుంది.సీజన్‌ 1 హిట్‌ అవడం ఒక రీజన్‌ కాగా సీరీస్‌ కి ప్రేక్షకులలో ఉన్న డిమాండ్‌…

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ ‘వృషభ’లో భాగస్వామిగా హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో

Hollywood executive producer Nick Thurlow to partner Malayalam superstar Mohanlal in 'Vrishabha'

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాన్, రోషన్ మేక, శనయ కపూర్‌, జహ్రా ఖాన్‌ల‌తో పాన్ ఇండియా వైడ్‌గా చేస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించాడు. సహ నిర్మాతగా వ్యవహరించాడు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతున్న తీస్తోన్న మొదటి సినిమాకు వృషభ రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మాట్లాడుతూ..…

Hollywood Executive Producer Nick Thurlow joins Mohanlal and Roshan Meka’s “Vrushabha” team

Hollywood Executive Producer Nick Thurlow joins Mohanlal and Roshan Meka's "Vrushabha" team

The makers of Vrushabha, which boasts of top actors like Mohanlal and Roshan Meka and that which marks the launch of Zahrah S Khan and Shanaya Kapoor on a pan-India level, have now roped in Nick Thurlow as the Executive Producer of their film. Nick Thurlow, who’s known to have produced and co-produced several Hollywood films in the past, acquired laurels for academy awards winning films like Moonlight (2016) and Three Billboards Outside Ebbing, Missouri (2017) With Nick Thurlow now on board, Vrushabha merits itself as a superior quality film…

మెగాస్టార్ ‘భోళా శంకర్’ నుంచి తీనుమారు సాంగ్ విడుదల!

Megastar 'Bhola Shankar' released Theinumaru song

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుండడంతో థియేటర్లలో మెగా యుఫోరియాకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సినిమా ప్రమోషన్‌ లు దూకుడుగా జరుగుతుతున్నాయి. నిన్న భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి తీను మారు పాటని విడుదల చేశారు. మహతి స్వరసాగర్ ఈ పాటని గ్రాండ్ కార్నివాల్ ఎనర్జిటిక్ నెంబర్ గా స్కోర్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ మెస్మరైజ్ చేయగా కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పండగని రెట్టింపు చేసింది. ఈ పాటలో మెగాస్టార్ ఎనర్జిటిక్ గ్రేస్ ఫుల్…