మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా , సాయి మంజ్రేకర్ హరోయిన్ గా కిరణ్ కొర్రపాటి ని దర్శకుడుగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా గని. ఈ చిత్రాన్ని అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు లెజెండరి ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించి విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే రీసెంట్ గా విడుదలయ్యిన స్టార్ హీరోయిన్ తమన్నా సాంగ్ కి మాత్రం సోషల్ మీడియాలో చాలామంచి రెస్పాన్స్ రావటం విశేషం. ఈ పాటకి వచ్చిన రెస్పాన్స్ కి హీరోయిన్ తమన్నా కూడా మరింత వుత్సాహంతో ఈ సాంగ్ మీద రీల్స్ చేయటం ఫ్యాన్స్ కి మరింత వూపిచ్చింది. యూ ట్యూబ్లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్న ‘కొడితే’ సాంగ్ కి ఇప్పుడు స్పెషల్…
Author: M.D ABDUL - Tollywoodtimes
తమన్నా పాటకు అదిరిపోయే రీల్ చేసిన ‘గని’ హీరోయిన్ సాయి మంజ్రేకర్!!!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ‘కొడితే’కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వచ్చింది. ఆమె పాటకు రీల్స్ చేస్తున్నారందరూ. తమన్నా తన పాటకు తానే రీల్ చేసుకున్నారు. తాజాగా ఈ పాటకు హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు కూడా అద్భుతమైన స్పందన వస్తుంది. గని సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్తో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు మంచి రెస్పాన్స్…
శ్రీకాంత్ ‘కోతలరాముడు’ ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల
శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘కోతల రాయుడు’. వెంకటరమణ మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1గా కొలన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్ లో విడుదల కానుంది. ‘కృష్ణాష్టమి’ ఫేం డింపుల్ చోపడే, ‘జై సింహ’ ఫేం నటషా దోషి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృద్వి, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కృష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయని, శ్రీకాంత్ పాత్ర అందరికి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుందని దర్శకుడు సుధీర్ రాజు తెలిపారు. మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని కోతలరాయుడు సినిమా మా అందరికి మంచి పేరు…
‘కళింగపట్నం జీవా’ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల
రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరోహీరోయిన్లుగా పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కళింగపట్నం జీవా’. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్పై హీరో రిత్విక్ చిల్లికేశల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘మళ్లీ రావా’ చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్ర ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ‘లక్ష్య’ మూవీ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడితో పాటు చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘చిత్ర మోషన్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. రెగ్యులర్ సినిమాలా కాకుండా వైవిధ్యమైన కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా తెలుస్తోంది. ఒక నిర్మాతగా సినిమా నిర్మాణం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది, తనే కథ రాసుకుని.. హీరోగా, ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడం…
ఫిబ్రవరి 4న వస్తున్న ‘అతడు ఆమె ప్రియుడు’
ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం “అతడు-ఆమె-ప్రియుడు”. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో… శ్రీమతి కూనం కృష్ణకుమారి సమర్పణలో… రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ విభిన్న కథాచిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి-రిలీజ్ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, రచనా సంచలనం విజయేంద్రప్రసాద్, దశరథ్, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఈ వేడుకలో… చిత్ర దర్శకుడు యండమూరి, నిర్మాతలు రవి కనగాల,-రామ్ తుమ్మలపల్లి, హీరో భూషణ్, హీరోయిన్ మహేశ్వరి, ఈ…
ఆది సాయికుమార్ ‘సీఎస్ఐ సనాతన్’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
చాగంటి ప్రొడక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “సీఎస్ఐ సనాతన్”. ఈ చిత్రంలో క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ (సియస్ ఐ) ఆఫీసర్ గా ఆదిసాయికుమార్ ఒక కొత్త రోల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న “సీఎస్ఐ సనాతన్” సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక బిల్డింగ్ లో జరిగిన హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం హీరో తన టీమ్ తో రావడం చూపించారు. క్రైమ్ జరిగిన ప్రాంతంలో పిస్టల్, కత్తి, కళ్లద్దాలు, ఫింగర్ ప్రింట్స్, బాడీ పడిఉన్న డ్రాయింగ్..ఇలా ఆధారాలు ఉన్నాయి. ఈ క్లూస్ తో నేరస్థులను హీరో ఎలా పట్టుకోబోతున్నాడు అనేది ఇంట్రెస్టింగ్…
‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు..’ ఫిబ్రవరి 2న ‘పక్కా కమర్షియల్’ తొలి సింగిల్ విడుదల..
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో.. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ సినిమాలోని మొదటి సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తి దాయక గీతం పక్కా కమర్షియల్ లో ఉంది. ఫిబ్రవరి 2 పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. సిరివెన్నెల గారు చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు. ‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ ఈయన ఒక అందమైన పాట రాశారు. ఈ పాటలోని లిరిక్స్ తలుచుకొని దర్శకుడు మారుతి ఎమోషనల్ అయ్యారు. మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని…
తెలంగాణ కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా నీలం పద్మ వెంకటస్వామి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశారు ఈ కమిటీ సభ్యులుగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన నీలం పద్మ నియమితులయ్యారు . ఈ సందర్బంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జి కో -ఆర్డినేటర్ , యా దాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ తనను 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు మానిటరింగ్ కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది. అవి.. 1. పెద్ద పెళ్లి, 2. కరీంనగర్, 3. చొప్పదండి, 4. వేములవాడ, 5. సిరిసిల్ల, 6. మానకొండూరు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి డిజిటల్ సభ్యత్వాలను అధిక సంఖ్యలో చేపడుతామని అన్నారు. నా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించి తన నియామకానికి సహకరించిన పిసిసి చీఫ్ రేవంత్…
రాజమౌళి ప్రశంసలు అందుకున్న జీ 5 ఒరిజినల్ సిరీస్ ‘లూజర్ 2’ నటుడు శశాంక్
ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ 5’లో విడుదలైన ఒరిజినల్ సిరీస్ ‘లూజర్’ చూశారా? ఆ సిరీస్ను అంత త్వరగా వీక్షకులు మర్చిపోలేరు. టైటిల్ ‘లూజర్’ కావచ్చు. కానీ, రిజల్ట్ విషయంలో విన్నరే. వీక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేసిన సిరీస్ అది. ‘జీ 5’లోనే ఇప్పుడు ఆ సిరీస్కు సీక్వెల్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే! ‘లూజర్ 2’ను ఇటీవల ప్రముఖ దర్శకులు రాజమౌళి చూశారు. ప్రశంసించారు. విలక్షణ కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్లు, కొత్త సినిమాలు… అన్ని వర్గాల ప్రజలకు వినోదం అందిస్తున్న ఏకైక ఓటీటీ వేదిక ‘జీ 5’. ‘జీ 5’… ఓటీటీ వేదిక మాత్రమే కాదు, అంతకు మించి! ఎప్పటికప్పుడు వీక్షకులకు ఏదో ఒక కొత్తదనం అందించాలనే సంకల్పంతో మనసులను తాకే కథలను చెప్పడానికి ప్రయత్నిస్తుంది. స్పోర్ట్స్ డ్రామా…
ZEE5 Original ‘Loser 2’ receives applause from SS Rajamouli
Actor Sashank is elated about the celebrated filmmaker’s endorsement Hyderabad, 29 January, 2022: ‘Loser’, the ZEE5 original released in 2020, has been considered a memorable series by the viewers. While the title is ‘Loser’, the result has been winsome. The series has found a place in the viewers’ minds since its release. Its sequel, ‘Loser 2’, was released on ZEE5 on January 21 this year. It has struck a chord with viewers of ZEE5. And now, the original has come in for praise from India’s celebrated filmmaker SS Rajamouli. ZEE5,…
