తెలుగు సినిమా ప్రచారం గురించి కొంత మాట్లాడుకోవాలి. 80 దశాబ్దాలు దాటిన తెలుగు సినిమా ప్రచారం -కొత్త వేళ్లూనుతోంది. సరికొత్త కోణాలు వెతుకుతోంది. లుక్కులు, చాప్టర్లు, ఫెస్ట్లు, ఫీస్ట్లతో కొంగొత్త వెలుగులూ విరజిమ్ముతోంది. ప్రచారం ‘పల్స్’ పట్టేందుకు ఇంకేవేవో చేస్తోంది కూడా. మొత్తంగా ప్రచారం మాత్రం సినిమాను మించిపోతోంది. ప్రమోషన్తో -సినిమా హిట్టు ఫట్టుకు సంబంధం లేదు. కానీ, ఆ సినిమావైపు దృష్టిని మరల్చాలంటే బలమైన ప్రచారం ఒక్కటే మార్గం. తప్పదు. ప్రచార పరిణామక్రమాన్ని ఒక్కసారి పరిశీలిస్తే-అరవయ్యో దశకం సినిమా ప్రచారం ఇప్పటి జనరేషన్కు అర్థమయ్యేలా చెప్పాలంటే ‘పక్కా నాటు’ అంటే సరిపోతుందేమో. జట్కా బండికో, జోడెద్దుల గూడుబండికో పోస్టర్లు అంటించి, కరపత్రాలు పంచుతూ సినిమా ప్రమోషన్ సాగేది. పల్లెల్లో జరిపే ప్రచారంతో పాటు తెరలపై సినిమాలూ ప్రదర్శించేవారు. 70వ దశకం వచ్చేసరికి ప్రమోషన్ కాస్త మారింది.…
Author: M.D ABDUL - Tollywoodtimes
అతి పెద్ద ఇండస్ట్రీగా టాలీవుడ్!
కొన్నేళ్ల క్రితం వరకూ .. హిట్టందుకున్న తెలుగు సినిమా తమిళంలో కనిపించేది. సక్సెస్ కొట్టిన తమిళ సినిమా తెలుగు స్క్రీన్మీద అనువాదంగానో, రీమేక్గానో కనిపించేది. ఇప్పుడు చాలావరకూ పెద్ద సినిమాలన్నీ మొత్తం సౌత్నే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. అన్ని భాషల్లో ఏకకాలంలో స్క్రీన్మీద సినిమా చూపించేందుకే దర్శక, నిర్మాత, హీరోలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే మొత్తం సౌత్ మీదే బాలీవుడ్ ఓ కన్నేసి ఉంచుతోంది. సౌత్ సినిమాని బాలీవుడ్ రీమేక్ చేసుకోవడం ఇప్పటిదేం కాదు. 80, 90 దశకాల్లోనే అలాంటి సినిమాలు మనకు కనిపించినా ఆ కథ వేరు. ఇప్పటి కథ వేరు. శాటిలైట్ పెరిగింది. డిజిటల్ మార్కెట్ విస్తృతమైంది. దీంతో సౌత్ సినిమాకు ముఖ్యంగా తెలుగు సినిమాలకు బాలీవుడ్లో హైవే ఏర్పడింది. సక్సెస్ రేట్తో సంబంధం లేకుండా దాదాపు వస్తున్న సినిమాలన్నీ నార్త్లోకీ అనువాదమవుతున్నాయి. సౌత్…
బుద్ధి యజ్ఞమూర్తికి ‘పాత్రికేయ శిరోమణి’ పురస్కార ప్రదానం
ఏప్రిల్ 20-2022 రాత్రి రవీంద్రభారతిలో నేను శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో పాత్రికేయ శిరోమణి పురస్కారాన్ని అందుకున్నాను. అవార్డు కమిటీ చైర్మన్ డాక్టర్ మహమ్మద్ రఫీ ఫోన్చేసి, ఆ పురస్కారానికి నన్ను ఎంపిక చేసినట్లు చెప్పగానే, నిజంగా మొదట ఆ పురస్కారాన్ని అందుకోవడానికి నేను అర్హుడనేనా అనే ప్రశ్న వెంటనే మనసులో మెదిలింది. అంగీకారం తెలపడానికి సందేహించాను. జర్నలిస్టుగా, రచయితగా నా కెరీర్ ఎలా సాగుతూ వచ్చిందో, నేనేం రాశానో, నేనేం సాధించానో 1993 నుంచీ రఫీకి చాలావరకు తెలుసు. ఆ విషయం అతను చెప్పగానే సరేనన్నాను. ఈ సందర్భంగా నేనేమిటన్నది చాలావరకు తెలీని మిత్రులు, కొంతే తెలిసిన మిత్రులు చాలామందే ఉంటారు. వాళ్ల కోసమే ఈ నాలుగు (నాలుగంటే నాలుగు కాదనుకోండి) మాటలు… 22 సంవత్సరాల వయసులో.. 1993లో…
చిత్ర నిర్మాణ రంగంలోకి యువ గేయ రచయిత తైదల బాపు!!
6 టీన్స్, ‘గర్ల్ఫ్రెండ్’,పటాస్,ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్ శ్రీరాం, అధినేత, సెల్ఫీరాజా ఇలా దాదాపు 236 సినిమాల్లో దాదాపు 500కు పైగా సూపర్ హిట్ పాటలతో యువతను విపరీతంగా ఆకట్టుకుని.. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న యువ గేయ రచయిత తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్ 25. పచ్చని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని చెప్పిన తైదల బాపు పిలుపు మేరకు మంచిర్యాల జిల్లాలో 2022 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆయన అభిమానులు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా, తాండూరు మండలం మాదారం టౌన్ షిప్ లోని సింగరేణి కార్మిక కుటుంబానికి చెందిన తైదల…
‘ధర్మస్థలి’ సక్సెస్ తో మా కష్టాన్ని మర్చిపోయాం : శకలక శంకర్
‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు రమణ మొగిలి బాగా తీశారు’’ అన్నారు శకలక శంకర్. పావని,భూపాల్ రాజ్, షాజీ షిండే ,మిర్చిమాధవి, ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా అశ్వథ్ నారాయణ సమర్పణలో రమణ మొగిలి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ధర్మస్థలి’. ఈ నెల 23న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా శకలక శంకర్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. రాజేంద్ర భరద్వాజ్ రాసిన మాటలు, వినోద్ యాజమాన్య చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఆడియెన్స్ నుంచి మచి స్పందన లభిస్తోంది ‘‘మౌత్ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా ‘ధర్మస్థలి’ సినిమా…
‘కళ్యాణమస్తు’లో ముక్కుపుడక లిరికల్ సాంగ్ కు అనూహ్యమైన స్పందన..
శేఖర్ వర్మ, వైభవి జంటగా SMS క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి రఘు బాబు నిర్మిస్తున్న సినిమా కళ్యాణమస్తు. తాజాగా ఈ సినిమాలోని ముక్కుపుడక అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో శేఖర్ వర్మ చేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర.. సుర సుర నీ చూపుల్లో ఉందే మందుపాతర.. నిగ నిగ నీ బుగ్గల్లో నింపినావే చక్కెర.. అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, ధృవన్ పాడారు. O. సాయి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. RR ధ్రువన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు VVNV సురేష్ ఎడిటర్. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక…
తానా సమ్మేళనంలో బండిరాజుల శంకర్ కవితాగానం
ఉత్తర అమెరికా సంఘం (తానా) ప్రపంచ సాహిత్య వేదిక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కవితాలహరి జూమ్ కార్యక్రమంలో శనివారం రాత్రి ఆలేరుకు చెందిన కవి, విద్యావేత్త బండిరాజుల శంకర్ పాల్గొన్నారు. సంప్రదాయం,మానవత్వాల ప్రతిబింబంగా భారతీయ జీవన విశిష్టతను చాటిచెబుతూ తాను రచించిన మానవత్వం నా ఉనికి అన్న కవితను ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో శంకర్ చదివి వినిపించి బహుముఖ ప్రశంసలందుకున్నారు. అద్భుతమైన, ఆలోచనాత్మకమైన అనేక ఉపమానాలతో కవిత్వాన్ని మావనతా పరిమళంగా తానా అంతర్జాతీయ వేదిక ద్వారా అందించిన శంకర్ను తానా అధ్యక్షులు అంజయ్య చౌదరిలావు, తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రశంసించారు. భారతీయ జీవన విలువలను వ్యక్తీకరిస్తూ తమ కవితను తానా సమ్మేళనంలో అంతర్జాతీయ స్థాయిలో వినిపించి ఆలేరు సాహిత్య ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పిన శంకర్ను ఆలేరు,…
నాటకానికి మహర్దశ : తనికెళ్ల భరణి .. ఈ అవకాశం నాటక నటులకు ఆస్కార్ అవార్డుతో సమానం
‘‘పూర్వం నాటకాలను పోషించేవారిని మహారాజు శ్రీ కృష్ణదేవరాయలుతో పోల్చేవారు. ఈ రోజుల్లోను ఇంకా కృష్ణదేవరాయల కాలం నాటి మహారాజ పోషకులు సీఆర్సి కాటన్ కళా పరిషత్ రూపంలో ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ దర్శకులు ఎస్వీ. కృష్ణారెడ్డిగారు 23ఏళ్ల క్రితం భరణిగారు నేను బిజీగా ఉన్నాను ఓ సారి మీరు రావులపాలెం సీఆర్సిక్లబ్కి వెళ్లి ఓ కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి అంటే సరే కదా అని వెళ్లాను. తర్వాత సీఆర్సి ఫౌండేషన్ వారు చేస్తున్న అనేక రకాలైన సేవ కార్యక్రమాలను చూసి షాకయ్యాను. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న మీరు నాటక కళా పరిషత్ను స్థాపించి మంచి నాటకాలు వేయించొచ్చు కదా అన్నాను. అప్పుడు వారు సదుపాయలు ఏం కావాలన్నా మేము చేస్తాం కాని, నాటకానికి సంబంధించిన కార్యక్రమాలను మీరు దగ్గరుండి చూసుకుంటే నాటక పరిషత్ నిర్వహించటానికి…
Rajasekhar’s ‘Shekar’ to be released in theatres on May 20
‘Shekar’ is the 91st movie in the career of Dr. Rajasekhar. His elder daughter, Shivani, has played a crucial role in the movie. She has played Rajasekhar’s daughter in it. This is the first-of-its-kind collaboration of a father and a daughter on the silver screen. The film is directed by Jeevitha Rajasekhar, who has also penned the thriller’s screenplay. Beeram Sudhakara Reddy, Shivani Rajashekar, Shivathmika Rajashekar, and Boggaram Venkata Srinivas have joined hands to produce it on Pegasus Cinecorp, Taurus Cinecorp, Sudhakar Impex IPL, and Tripura Creations. ‘Shekar’ is presented…
జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన `శేఖర్` చిత్రం మే 20న విడుదల
డా. రాజశేఖర్ నటించిన 91వ చిత్రం `శేఖర్`. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. కథ ప్రకారం రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం విడుదల తేదీ పోస్టర్ను శనివారంనాడు విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. మే 20న ఈ చిత్రం విడుదకానున్నట్లు జీవితా రాజశేఖర్ ప్రకటించారు. వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ ఈ చిత్రానికి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకురాలు జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మాకెంతో సహకరించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్…
