పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల కోటేశ్వరరావు ‘పురుష:’ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీని మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, టీజర్ ఇలా అన్నీ అందరినీ ఆకట్టుకున్నాయి. సినిమా ప్రమోషన్స్లో భాగంగా హీరో పవన్ కళ్యాణ్ మీడియాతో పంచుకున్న విశేషాలివే.. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది పల్నాడులోని మాచర్ల దగ్గర్లోని కారంపూడి. మాకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. మా నాన్న గారు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. మా నాన్నకి…
Author: M.D ABDUL
కోలీవుడ్ నిర్మాత కె.రాజన్ ఆత్మహత్య
కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె. రాజన్ (85) ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆయన అడయార్ కూవం నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే 85 ఏళ్ళ వయస్సులో రాజన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కుటుంబ సమస్యల వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారని టాక్. ఏడాదిగా రాజన్.. కుటుంబంతో కలిసి ఉండడం లేదని, హోటల్ లో ఉండడం వలన రోజు కూతురు భోజనం తీసుకోని వస్తోందని తెలుస్తోంది. రాజన్ ‘బ్రహ్మసరిగళ్’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిర్మాతగానే కాకుండా డైరెక్టర్ గా, రైటర్ గా కూడా వర్క్ చేశారు. నటుడిగా…
‘రాక్షసపురం’ విజయం సాధించడం సంతోషంగా ఉంది : చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు
ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ రోజు (మే 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలకు వచ్చిన ‘రాక్షసపురం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ – ‘రాక్షసపురం’ చిత్రాన్ని 147కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. సినిమా చూసిన వాళ్లు చాలా బాగుందని అంటున్నారు. కలెక్షన్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల ఇంకా పికప్ అవుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నా స్నేహితుడు సతీష్ ఈ సినిమా చూడమని…
విశిష్ట రికార్డు..చరిత్రలో మరో గుర్తుండిపోయే అధ్యాయం
గర్వకారణమైన మరియు ఆనందభరితమైన సందర్భంగా, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న Abi Sri 1 Tower లో ఏర్పాటు చేసిన “అత్యంత ఎత్తైన బహుముఖ భవన ఇన్స్టాలేషన్లో 48 అడుగుల ఎత్తుతో ‘1’ సంఖ్య ప్రదర్శన”కు అనేక ప్రతిష్ఠాత్మక రికార్డు సంస్థల నుండి అధికారిక గుర్తింపు లభించింది. ఇందులో Karnataka Book of Records, Bharatiya Book of Records, Grand Universe Book of Records మరియు London Book of Records ఉన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన Abi Sri 1 Tower తన అసాధారణ నిర్మాణ వైభవం ద్వారా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. భవనంలోని పలు వైపులా 48 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠాత్మకంగా ప్రదర్శించిన భారీ “1” సంఖ్య వినూత్నత, ప్రతిభ, దూరదృష్టికి ప్రతీకగా నిలిచి, ఆర్కిటెక్చర్ మరియు కాన్సెప్చువల్ డిజైన్ రంగాల్లో…
Distributors and Producers Also Have Their Own Challenges… The Industry Survives Only When Cinema Survives: Telugu Film Producers
Telugu film producers stated that not only exhibitors, but distributors and producers are also facing serious challenges in the current theatrical ecosystem. It is known that exhibitors recently held a press meet demanding the implementation of the percentage system, claiming they are under severe financial pressure. Responding to this issue, Telugu film producers held a press meet on Wednesday evening. Producers Yalamanchili Ravi Shankar, Suryadevara Naga Vamsi, Sahu Garapati, Sudhakar Cherukuri, Venkata Satish Kilaru and others participated in the media interaction. The producers stated that it was not appropriate for…
డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయి.. సినిమా నడిస్తేనే మనందరం నడుస్తాం: తెలుగు సినీ నిర్మాతలు
ఎగ్జిబిటర్లకు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు కూడా సమస్యలు ఉన్నాయని తెలుగు సినీ నిర్మాతలు అన్నారు. తాము ఇబ్బందుల్లో ఉన్నామని, పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎగ్జిబిటర్లు ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బుధవారం సాయంత్రం తెలుగు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, సూర్యదేవర నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, వెంకట సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిటర్లు ఏక పక్షంగా ప్రెస్ మీట్ నిర్వహించి బెదిరించినట్టుగా మాట్లాడటం సరికాదని, అందరం కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోవాలని నిర్మాతలు అన్నారు. ఎగ్జిబిటర్ల సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అదే సమయంలో తమ సమస్యలకు కూడా పరిష్కారం కావాలని నిర్మాతలు అన్నారు. నిర్మాత యలమంచిలి రవిశంకర్ మాట్లాడుతూ..…
దూరదర్శని సమీప దర్శనిగా మీ హృదయాలకు హత్తుకుంటుంది : ప్రియదర్శి
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ ‘దూరదర్శని’. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం రేపు (మే 15)న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేట్రికల్గా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో ప్రియదర్శి, రాజు వెడ్స్ రాంబాయ్ చిత్ర దర్శకుడు సాయి కంపాటి హాజరయ్యారు. దర్శకులు సాయిలు కంపాటి మాట్లాడుతూ ” టైటిల్ బాగుంది. 90వ దశకంలో పుట్టిన అందరికి కనెక్ట్ అవుతుంది. తప్పకుండా సినిమా అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు’ ప్రియదర్శి మాట్లాడుతూ ” ఇలాంటి కొత్త సినిమాను సపోర్ట్ చేయాలని ఉంది. ఈ…
శ్రీ అమ్మ భగవాన్ బోధనల నేపథ్యంలో “ఏదైనా సాధ్యమే” మూవీ
▪️ ఫిలిం చాంబర్లో టైటిల్ ఆవిష్కరణ ఆధ్యాత్మికతను, మానవ సంబంధాలను మేళవిస్తూ శ్రీ ఆది లక్ష్మి పిక్చర్స్ బ్యానర్పై నిర్మిస్తున్న సరికొత్త చిత్రం “ఏదైనా సాధ్యమే”. ఈ సినిమాకు “దైవం తోడుంటే..” అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లోని ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు మద్దూరి రాజా, నిర్మాత అనిల్ మునగనూరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎన్. సుబ్రహ్మణ్యం, చిత్ర బృందం పాల్గొన్నారు. ప్రతి మనిషి తన ఇష్ట దైవంతో బలమైన అనుబంధాన్ని పెంచుకోవడం ద్వారా జీవితంలోని దుఃఖాల నుండి, బాధల నుండి ఎలా విముక్తి పొందవచ్చనే అంశాన్ని ఈ సినిమా ద్వారా చూపించనున్నారు. ముఖ్యంగా ఈ చిత్ర నిర్మాణం మొత్తం “శ్రీ అమ్మ భగవాన్” బోధనల ఆధారంగా రూపొందుతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా కథనం ప్రధానంగా…
25 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘గాలి’
సంధ్య ఫిలిం బ్యానర్ పై రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల యస్. చంద్ర కళ,చందా రోజా రాణి, బివి సుబ్బారెడ్డి నటీనటులుగా నాటక రంగంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గ్రహీత మరియు నంది గరుడ వంటి అవార్డులు పొందిన టి రాము దర్శకత్వంలో నిర్మాత చందా లక్ష్మీనారాయణ నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం “గాలి”. ఈ చిత్రం నేటికి విడుదలై 25 రోజులైనా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, నిర్మాత సాయి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. బళ్లెం వేణుమాధవ్,రచయిత్రి జంద్యాల సుబ్బలక్ష్మి, డా. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం.. గెస్ట్ గా వచ్చిన ప్రముఖ దర్శకుడు…
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ట్రైలర్ లాంచ్
ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో త్రిగుణ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ ఈ సమ్మర్లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మంచి…
