‘నర్తనశాలచిత్రం నుండి అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ ఫస్ట్లుక్ విడుదల. నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన పౌరాణిక చిత్రంనర్తనశాల`. అర్జునుడిగా బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు నటించిన ఈ చిత్రంలోని దాదాపు 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను విజయదశమి కానుకగా శ్రేయాస్ ఈటి ద్వారా ఎన్బికె థియేటర్ లో ఈ నెల 24న తిలకించే అరుదైన అవకాశం కల్పిస్తున్నారు నటసింహ బాలకృష్ణ . తాజాగా నర్తనశాల నుండి నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ రోజు విడుదల చేశారు. ఇందులో అర్జునుడిగా బాలయ్య లుక్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు. మరో పౌరాణిక పాత్రలో బాలయ్యని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ‘‘నాకు…
Author: M.D ABDUL
నిఖిల్ ‘18 పేజీస్’ షూటింగ్ ప్రారంభం
ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీల్ని ఎంచుకుంటూ వరుసగా సూపర్ హిట్స్ కొడుతున్నారు డైనమిక్ హీరో నిఖిల్. ఈ పంధాలో అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా 18 పేజీస్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో 100 % లవ్, భలే భలే మగాడివోయ్, పిల్లా నువ్వు లేని జీవితం, గీతగోవిందం, ప్రతి రోజు పండగే వంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో సక్సెస్ ఫుల్ నిర్మాతగా అందరి మన్ననలు పొందున్న బన్నీ వాసు నిర్మాణ సారధ్యంలో 18 పేజీస్ చిత్ర తెరకెక్కుతుంది. ఈ సినిమా నిర్మాణంలో బన్నీ వాసుతో పాటు భాగస్వామిగా వ్యవహరిడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు స్టార్ డైరెక్టర్ సుకుమార్. ఇక సక్సెస్ ఫుల్ సినిమాలతో సినీ అభిమానుల్లో తనదైన…
‘సారధి’గా నందమూరి తారకరత్న
పంచభూత క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న “సారధి” చిత్రం ఇటీవల ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనిలో హీరోగా నందమూరి తారకరత్న, హీరోయిన్గా కోన శశిత నటిస్తున్నారు. ఈ సంధర్భంగా చిత్ర దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ‘గతంలో ఖోఖో నేపథ్యంలో ‘రథేరా’ నిర్మించాం. జనవరిలో విడుదల అయిన ఈ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను చూసి… ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి నాన్న… ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మమ్మల్ని అభినందించారు. ఈ సినిమా కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు ఖోఖో నేపథ్యంలోనే తారక రత్నతో “సారధి” సినిమా తీస్తున్నాం. ఇందులో తారక రత్న డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. కావున మీరందరూ ఆదరించాలి. ఈ చిత్రం ఒక…
ప్రతిభావంతుల కోసం ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’
గాయనీ గాయకులను, బ్యాండ్స్ను వెలుగులోకి తీసుకు రావాలనే గొప్ప ఉద్దేశంతో సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ సోమవారం నాడు ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’ కాంపిటీషన్ ప్రారంభించారు. దీనికి ఆయన కుమార్తె ఐశ్వర్య క్రిష్ణప్రియ నిర్మాత. వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన ఈ కాంపిటీషన్ సుమారు 12 వారాలు సాగనుంది. ఆ తరువాత 13వ వారంలో ఫైనల్స్ జరగనున్నాయి. ‘డెక్కన్ మ్యూజిక్ ఛాలెంజ్’ ప్రారంభమైన సందర్భంగా శశి ప్రీతమ్ మాట్లాడుతూ ‘‘మన దగ్గర చాలామంది సంగీత కళాకారులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రజలకు తెలియదు. సినిమాలో గాయనీ గాయకులు ప్రేక్షకులకు తెలుస్తారు. కానీ, వేరే వాళ్ళు బయటకు తెలియదు. గత ఐదేళ్ళుగా రాక్ బ్యాండ్ సంస్కృతి హైదరాబాద్లో పెరిగింది. ఇప్పుడు రాక్ బ్యాండ్ ట్రెండ్ అవుతున్నాయి. పబ్స్లో వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి. తొలుత ఇంగ్లిష్ పాటలతో ప్రారంభించిన బాండ్స్, పబ్లిక్ డిమాండ్…
‘చెప్పినా ఎవరూ నమ్మరు’కి యంగ్ హీరో సపోర్ట్
శ్రీ మోనిక స్రవంతి ఆర్ట్ ప్రొడక్షన్స్ లో నూతనంగా నిర్మిస్తున్న చిత్రం “చెప్పినా ఎవరూ నమ్మరు” పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకుని లాక్డౌన్ తరువాత థియేటర్లలో ఈచిత్రాన్ని మొదటి చిత్రంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ చిత్రం యొక్క ప్రమోషన్స్ లో భాగంగా మొదటి సారిగా నేటి యువతరం హీరోల్లో విజయపథంలో దూసుకెళ్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో విస్వక్ షేన్ “చెప్పినా ఎవరూ నమ్మరు” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసి… ఈ సినిమా మంచి విజయం సాధించి… అందరికి గుర్తింపు రావాలని చిత్ర యూనిట్ను అభినందించారు. చిత్ర నిర్మాత డాక్టర్ ఎం. మురళి శ్రీనివాసులు మాట్లాడుతూ… ” ముందుగా అడిగిన వెంటనే మా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించిన…
‘18 పేజీస్’లో నిఖిల్కి జోడి సెట్టయింది
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి సమర్పణలో సక్సెస్ ఫుల్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు పై టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న చిత్రం 18 పేజీస్. అర్జున్ సురవరం వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నిఖిల్ 18 పేజీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి, వాటితో పాటే తాజాగా చిత్ర బృందం నిఖిల్ కి ఈ సినిమాలో జోడిని కూడా ఎంపిక చేశారు. అటు తన అభినయంతో ఇటు తన అందాలతో తెలుగు కుర్రకారు హృదయాల్ని దోచుకుంటున్న మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లుగా 18 పేజీస్ టీమ్ అధికారికంగా ప్రకటించారు. చాలా రోజులు…
‘లింగోచ్చా’ టీజర్ రిలీజ్ ఎప్పుడంటే..
కెరాఫ్ కంచెరపాలెం చిత్రం లో జోసెఫ్ గా నటించి వీక్షకుల్ని ఆకట్టుకున్న కార్తిక్ రత్నం హీరోగా, సుప్యార్ధ్ సింగ్ హీరోయిన్ గా ప్రముఖ నిర్మాత యాదగిరి రాజు శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో, బ్లాక్ బాక్స్ స్టూడియోస్ సమర్పణ లో నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా (గేమ్ ఆఫ్ లవ్).. ఈ చిత్రానికి ఆనంద్ బడా దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు హైదరాబాది కావటం వలన ఇక్కడ ఎంతో ఫేమస్ అయిన లింగోచ్చా గేమ్ నేపధ్యం లో ఒక చక్కటి ప్రేమకథని రాసుకుని తెరకెక్కించారు. అంతే కాదు ఈ ప్రేమకథ కి లింగోచ్చా అనే టైటిల్ ని ఖరారుచేయటం విశేషం. ఈ టైటిల్ విన్న ప్రతిఓక్కరూ సౌండింగ్ కొత్త గా వుందని అనటం యూనిట్ కి కొత్త ఎనర్జి ఇచ్చింది. ఇదే ఎనర్జితో లింగోచ్చా టీజర్ ని రెడి చేశారు.…
నా ‘మనసంతా నువ్వే’ అంటోన్న ఎంఎస్ రాజు
జీవితంలో చాలా విషయాలు మరచిపోతాం మనం.కానీ, కొన్ని సంఘటనలు….కొన్ని జ్ఞాపకాలు….కొన్ని అనుభవాలు….కొన్ని గాయాలు….అంత సులువుగా మర్చిపోలేం!అందుకే 19 ఏళ్ల క్రితం నాటి విషయాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుండిపోయాయి.2001 సంక్రాంతి…నా ‘దేవీపుత్రుడు’ రిలీజ్.ఒకటి రెండూ కాదు.. 14 కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయాయి. నేను పడిన కష్టం, నేను పెట్టుకున్న ఆశలు అంతా ఆవిరైపోయాయి.దెబ్బలు నాకు కొత్త కాదు… పరాజయాలు నాకు పరిచయం లేనివి కాదు… కానీ ఈ దెబ్బ, ఈ పరాజయం మాత్రం నన్ను బాగా కుంగదీసి పారేసింది.‘శత్రువు’ సక్సెస్ ఇచ్చిన కిక్,‘దేవి’ వల్ల వచ్చిన లైఫ్… ఇవన్నీ ఈ ఫెయిల్యూర్ తో స్మాష్.దానికితోడు కామెంట్లు.అంత బడ్జెట్ తో సినిమా అవసరమా అని ఇంకెంతోమంది తిట్లు.బాగా కుంగిపోయాను నేను.దాన్నుంచి బయటకు రావడానికి పది రోజులు పట్టింది నాకు.ఏదైనా అద్భుతం చేయాలని మనసు ఉవ్విళ్లూరడం…
