Mega Power Star Ram Charan ‘s “Peddhi” has been released and is receiving a wonderful response from the audience. Mega Power Star Ram Charan has carried the film completely on his shoulders with his extraordinary performance. Fans and audience who have seen his performance are praising him on the level of “Na Bhootho Na Bhavishyati” Producer , distributor , and exhibitor Natty Kumar said . He said .. Ram Charan’s dedication in wrestling fights, action scenes, and emotional display in this film stood out. It takes a lot of courage…
Month: June 2026
కుట్రలు, కుతంత్రాలను అధిగమించి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచిన ‘పెద్ది’ : నట్టి కుమార్ ప్రశంసలు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “పెద్ది” విడుదలై సినిమా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అసాధారణ నటనతో సినిమాను పూర్తిగా తన భుజాలపై మోసి ముందుకు నడిపించారు. ఆయన నటనను చూసిన అభిమానులు, ప్రేక్షకులు “నా భూతో నా భవిష్యతి” అనే స్థాయిలో ప్రశంసలు కురిపిస్తున్నారని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కుస్తీ పోరాటాలు, యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగాల ప్రదర్శనలో రామ్ చరణ్ చూపించిన అంకితభావం ప్రత్యేకంగా నిలిచింది. ఇలాంటి సాహసోపేతమైన కథను, క్లిష్టమైన పాత్రను చేయడానికి ఎంతో ధైర్యం కావాలి. కానీ రామ్ చరణ్ ఈ పాత్ర కోసం ప్రాణం పెట్టి పనిచేసినట్లు ప్రతి సన్నివేశంలో కనిపిస్తోంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి.…
‘పెద్ది’ మూవీ రివ్యూ.. స్ఫూర్తిదాయక ప్రయాణమే..!
టాలీవుడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూసిన సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. రెండో సినిమానే రామ్చరణ్ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చిబాబుకు రావడం, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కథానాయికగా నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం, జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివ రాజ్కుమార్ సహా చాలామంది నటీనటులు ఇతర కీలక పాత్రలలో నటించడం.. ఇలా అన్నీ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి. సోలో హీరోగా రామ్చరణ్ హిట్టు అందుకొని ఎనిమిదేళ్లు దాటిపోయింది. కమర్షియల్ ఫార్ములాతో చేసిన ‘గేమ్ ఛేంజర్’తో పాటు గత సినిమాలు అంతగా ఈ మెగా హీరోకు అచ్చి రాలేదు. సక్సెస్ కోసం తన మాస్ ఇమేజ్ను పక్కనపెట్టి రామ్చరణ్ చేసిన పాన్ ఇండియా చిత్రమిది. ‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఐదేళ్ల గ్యాప్తో బుచ్చిబాబు తీసిన సినిమా కూడా ఇదే. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన…
గుణశేఖర్ కు ఫిలింక్రిటిక్స్ బర్త్ డే విషెస్
టాలీవుడ్లో ఈ జనరేషన్లో ఏ దర్శకుడుకి లేని ప్రత్యేకత గుణశేఖర్కు మాత్రమే సొంతం. కెరీర్ మొదటి నుంచి ఒక రకమైన చిత్రాలకు పరిమితం కాకుండా డిఫరెంట్ స్టైల్లో సినిమాలు తీసుకుంటూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. లాఠీ సినిమాతో కెరియర్ ప్రారంభించి మొత్తానికి 30 ఏళ్ల పైబడిన కెరీర్లో మొత్తంగా 14 చిత్రాలు తెరకెక్కించాడు. అందులో పౌరాణిక, చారిత్రక, సోషల్ చిత్రాలను తెరకెక్కించాడు. ఈ జనరేషన్లో ఇన్ని జానర్స్లో సినిమాలు తీసిన దర్శకుడు ఎవరు లేరు. మొత్తంగా రాశి కంటే వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్కు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. గుణశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫిలింక్రిటిక్స్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు .. ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్…
ఎస్వీ కృష్ణారెడ్డి లాంటి గొప్ప దర్శకుల వల్లే బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి : ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
లెజెండరీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు చేసిన ప్రసంగం ఆహుతులను ఆకట్టుకుంది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ – బయట భరించరానంత ఎండలు ఉన్నాయి కానీ ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఫంక్షన్ లో మాత్రం కాశ్మీర్ మంచు కొండల్లో కూర్చున్నట్లు ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు గారు, ఎండీ రామ్మోహన్ రావు గారు, నా స్నేహితులు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి..ఇలాంటి మంచి వాళ్ల వల్ల ఇండస్ట్రీ ఎంత బాగుంది. ఇండస్ట్రీలోని వాళ్లంతా వచ్చి ఇలా హోమ్లీగా ఒక కార్యక్రమం చేసుకుని ఎంతో కాలమైంది. దాదాపు 40 ఏళ్లుగా ఇలాంటి మహానుభావులు ఉండబట్టే బ్రహ్మాండమైన చిత్రాలు తెలుగులో వచ్చాయి. సినిమా ఇండస్ట్రీ…
ఏదోరకంగా మెగాస్టార్ కుటుంబీకుల సినిమాలను ఆపాలని కక్ష కట్టారు
గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) 28 కోట్ల ఆర్థిక మోసాలు -విశాఖపట్నం ప్రెస్ మీట్ లో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపణ మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుటుంబీకులు నటించిన సినిమాలకు రిలీజ్ సమయంలో ఏదోరకంగా అడ్డంకులు సృష్టించి ఆపాలని దిల్ రాజు, శిరీష్ లు ప్రయత్నిస్తున్నారని, ‘మన శంకర వరప్రసాద్’ రిలీజ్ సమయంలో కూడా విశాఖపట్నం ఏరియాలో ఆ సినిమాను ఆపాలని వారు కుట్రలు పన్నారని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆరోపించారు. మంగళవారం విశాఖపట్నం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ, విశాఖపట్నంకు చెందిన గాయత్రీ దేవి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్)ను అడ్డం పెట్టుకుని, దిల్ రాజు, శిరీష్ లు ఆ…
హీరోల కోసం కథ రాయడం మానేయాలి : సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ ఇంటర్వ్యూ..
* ‘యుఫోరియా’ కొత్త ఎనర్జీని ఇచ్చింది.. సెన్సేషనల్ డైరెక్టర్ గుణ శేఖర్ తన విభిన్న కథనాలు, మేకింగ్, టేకింగ్తో తెలుగు ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంటారు. ‘చూడాలని వుంది’, ‘ఒక్కడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లను ఇచ్చిన గుణ శేఖర్ రీసెంట్గా ‘యుఫోరియా’ అంటూ న్యూ ఏజ్ సినిమాని తెరకెక్కించారు. ‘యుఫోరియా’ చిత్రానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నెల 2న ఆయన తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా గుణ శేఖర్ మీడియాతో తన సినీ జర్నీకి సంబంధించిన విశేషాలెన్నో పంచుకున్నారు. ‘యుఫోరియా’పై వచ్చిన స్పందన మీకు ఎలా అనిపించింది? -నేను నా కెరీర్లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘యుఫోరియా’ ఇంకో ఎత్తు. ఇలాంటి గొప్ప సినిమాలు మళ్లీ చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు చూశాను. ఎంతో మంది అనలిటికల్గా రివ్యూలు చేస్తే..…
M4M (Motive For Murder) Set for OTT Release from June 19, 2026 directed by Mohan Vadlapatla, starring Jo Sharma USA.
The suspense thriller M4M (Motive For Murder), which was released worldwide in theaters on May 8 directed/produced by Mohan Vadlapatla starring American Actress Jo Sharma and Sambeet Acharya, received an excellent response from audiences, media and critics alike. The film earned impressive ratings, including 9.1/10 on IMDb and 9.6/10 on BookMyShow, along with positive reviews from several leading newspapers, news channels and entertainment websites, with ratings ranging from 3.5 out of 5. Audience from both India and USA, celebrated the movie success marking it as one of best suspense thrillers…
జూన్ 19 నుండి ఓటీటీలోకి వస్తున్న M4M (Motive For Murder)
దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన, అమెరికన్ నటి Jo Sharma హీరోయిన్ గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “ఎం4ఎం (మోటివ్ ఫర్ మర్డర్)” మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు మరియు సినీ విమర్శకుల నుంచి విశేష ఆదరణను పొందింది. Jo Sharma, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఐఎండీబీలో 9.1/10, బుక్ మై షోలో 9.6/10 వంటి అద్భుతమైన రేటింగ్స్ను సాధించింది. అలాగే పలు ప్రముఖ దినపత్రికలు, టెలివిజన్ ఛానెల్లు మరియు వినోద వెబ్సైట్లు ఈ చిత్రానికి 5లో 3.5 వరకు రేటింగ్స్ ఇస్తూ ప్రశంసించాయి. భారత్తో పాటు అమెరికాలోని ప్రేక్షకులు కూడా ఈ చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ, ఇటీవలి కాలంలో వచ్చిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా అభివర్ణించారు. థియేటర్లలో విజయవంతమైన ప్రదర్శన…
పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు
– 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు – ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న 43వ సినిమా “వేదవ్యాస్” మేకింగ్ వీడియో లాంఛ్ సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా “వేదవ్యాస్” రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్ హీరోగా అరంగేట్రం చేస్తుండగా…కొరియన్ నటి జూన్ హ్యూంజీ, మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. “వేదవ్యాస్” సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని…
