-ప్రెస్ మీట్ లో నట్టికుమార్ షాకింగ్ కామెంట్స్ “థియేటర్స్ లో పర్సంటేజ్ విధానం అమలుకు నిర్మాతలు సుముఖంగానే ఉన్నారు. అయితే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ఇబ్బందులు తలెత్తని రీతిలో అందరికీ ఆమోదయోగ్యమైన పర్సంటేజ్ ను నిర్ణయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది” అని సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ స్పష్టంచేశారు. మంగళవారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రెంటల్ విధానంలో ఒక థియేటర్ కు రూ. 7,30,000/- వస్తుందని అనుకుంటే..ఆ థియేటర్ ఓనర్ సుమారు రూ.10,00,000/- వరకు పర్సంటేజ్ విధానంలో వచ్చేవిధంగా నిర్ణయించమని అడగడంలో తప్పులేదు. అదే పాతిక లక్షలకు సమానంగా పర్సంటేజ్ ఇవ్వమని అడిగితే, అది ఎంతమాత్రం సహేతుకంగా ఉండదు. సినిమాలలో నష్టం వస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ను ఆదుకునే వారు ఎవరూ లేరు.…
Month: June 2026
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు: జర్నలిస్టుల అక్రిడిటేషన్ల గడువు పెంపు
హైదరాబాద్: రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును వచ్చే నెల 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో-252, దానికి సవరణగా తీసుకొచ్చిన జీవో-103ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్తో పాటు మరికొందరు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అక్రిడిటేషన్కు సంబంధించిన అన్ని సౌకర్యాలను యథావిధిగా కొనసాగించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ కోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పెషల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. ప్రస్తుతం అమలులో ఉన్న కార్డుల గడువును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ,…
హృదయాన్ని కదిలించే కామెడీ : నెట్ఫ్లిక్స్లో ‘సూపర్ సుబ్బు’ స్ట్రీమింగ్
సుబ్బు సార్ క్లాస్ అందరికీ స్వాగతం, ఒక అమాయకమైన ప్రశ్నతోనే మొత్తం మాకిపూర్ గ్రామంలో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాధ్యాయుడు సుబ్బు! మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ‘సూపర్ సుబ్బు’ సిరీస్లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్గా తెరకెక్కిన ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కథలో సుబ్రహ్మణ్యం చిల్లుకూరి రావు అలియాస్ సుబ్బు అనే యువకుడు, మాకిపూర్ అనే గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉద్యోగం పొందుతాడు. ఎలాంటి అనుభవం లేకపోయినా, గ్రామస్తులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అడుగుపెట్టిన సుబ్బు, అక్కడ అనుకోని సంఘటనలు, విచిత్రమైన ప్రశ్నలు, హాస్యభరిత పరిస్థితులు, జీవితాన్ని మార్చే అనుభవాల మధ్య చిక్కుకుంటాడు. ఈ ప్రయాణంలో ప్రేమ, కుటుంబం,…
బన్నీ సాంస్కృతిక ప్రభావం: ఏఏ23 థీమ్ మ్యూజిక్ను ఉపయోగించిన ప్రధాని మోదీ
సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ మొదలు కాకముందే..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశమంతటా పెద్ద స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సినిమాలు, పాటలు, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ .. అన్నీ సరిహద్దులను దాటి ప్రేక్షకులను మెప్పించి వారి మనసుల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి. అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా పోస్టుల్లో ఒక దానిలో ఏఏ23 థీమ్ మ్యూజిక్ను ఉపయోగించటమే. ఇది అల్లు అర్జున్కు ఉన్న ప్రజాదరణ, సాంస్కృతిక ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ఏఏ23 ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పటికీ దాని థీమ్ మ్యూజిక్ ఇప్పటికే మెయిన్స్ట్రీమ్ చర్చల్లో చోటు దక్కించుకుంది. రాబోయే ప్రాజెక్ట్ నుంచి వచ్చిన కంటెంట్కే దేశవ్యాప్తంగా ఇంతటి ఆదరణ ఉండటమనేది చాలా అరుదైన విషయంగా పేర్కొనవచ్చు. చాలా సంవత్సరాలుగా అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ నటుడు మాత్రమే కాదు..…
‘ఇసకపట్నం’ట్రైలర్ విడుదల
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్ వీడియో తన తాజా తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసకపట్నం’ ట్రైలర్ ను హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేసింది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ ఏడు ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్ ను ప్రశాంత్ రఘతి రచించగా, తాజుద్దీన్ సయ్యద్ మాటలు అందించారు. తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్పై రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ సిరీస్లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. వీరితో పాటు సునీల్, నరేష్ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 2 నుంచి ప్రైమ్ వీడియో లో తెలుగు భాషతో పాటు…
రాక్స్టార్ అనిరుధ్ … కొత్త అధ్యాయానికి శ్రీకారం!
సంగీత సంచలనం..రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఆయన తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి చేసిన ‘అరవింద్’ పాటను రిలీజ్ చేశారు. ఈ కాంబోలో రిలీజైన తొలి పాట ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన ఈ ట్రాక్తో అనిరుధ్ తన సంగీత ప్రపంచంలోని పరిధిని దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు. 2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుధ్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దక్షిణాదిన జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్ వన్ వంటి పలు బ్లాక్బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అలాగే 2025లో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాతో బాలీవుడ్…
ఉర్రూతలూగించిన “కహర్వా” సంగీతం
మృదుల మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన కహర్వా 2026 సంగీత నివాళి విశేషంగా ఆకట్టుకుంది. ముంబయి నుంచి వచ్చిన ప్రముఖ గాయకుడు మహమ్మద్ వకీల్, హైదరాబాద్ గాయకుడు రవి నిశేష్ కలసి మరపురాని సంగీత ప్రదర్శనతో మైమరపించారు. మృదుల శ్రీవాస్తవ జన్మ దినోత్సవం సందర్బంగా శనివారం సాయంత్రం బి.ఎం.బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో కహర్వా 2026 సంగీత వేడుక కనుల పండువగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా విచ్చేసిన తొలి ద్వంద్వ పౌరసత్వం పొందిన పారిశ్రామికవేత్త కళాపోషకులు ఇఫ్తేకార్ షరీఫ్ జ్యోతి ప్రకాశనం చేసి, మృదుల చిత్రపటానికి పూలదండ సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీర్ జారా బాలీవుడ్ సినిమా ఫేమ్ గాయకుడు, జీటివి మెగా ఫైనల్ విన్నర్ మహమ్మద్ వకీల్ తనకు గుర్తింపు ఇచ్చిన తొలి ఆల్బమ్ లోని “యే కసక్ దిల్ కీ దిల్ మే”…
Excited “Kaharwa” music : Veer Jara Vakil, Nishesh impressed by Hindustani music
Kaharwa 2026 musical tribute organized by Mridula Memorial Foundation was particularly impressive. Famous singer from Mumbai Mr Mohammad Vakil and Hyderabad singer Mr Ravi Nishesh mesmerized with an unforgettable musical performance. On the occasion of Mridula Srivastava’s birth anniversary, the Kaharva 2026 music festival was organized at Bhaskara Auditorium of BM Birla Science Center on Saturday evening. Mr Iftekhar Sharif, the first dual-citizen industrialist who was the chief guest lighting the Jyoti and started the programme by offering a garland to Smt Mridula’s portrait. Vibhavari started with the song “Yeh…
‘పెద్ది’లో కొత్త సీన్స్ యాడ్ చేస్తున్నాం : డైరెక్టర్ బుచ్చిబాబు సానా
* సినిమా బ్రహ్మాండంగా రన్ అవుతోంది. * చరణ్ పెర్ఫార్మెన్స్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్బస్టర్ ‘పెద్ది’. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో సంచలన విజయాన్ని సాధించింది. 2026 సౌత్ ఇండియా నంబర్ వన్ గ్రాసర్ గా నిలిచింది అన్ని ప్రాంతాల్లో హౌస్ఫుల్ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమౌతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ను నిర్వహించింది. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత సతీష్ కిలారు, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్, మైత్రీ శశి ప్రెస్…
ది దేవరకొండ ఫౌండేషన్ ద్వారా ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన హీరో విజయ్ దేవరకొండ
– సొంత ఊరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ – అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేత – 9,10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకర్స్ కు ఉపకార వేతనం అందించిన విజయ్ దేవరకొండ – ఏటా ఈ స్కాలర్ షిప్స్ అందిస్తాం, తెలంగాణ వ్యాప్తంగా ప్రతిభ గల పేద విద్యార్థులకు అండగా నిలవాలనేది నా కల – విజయ్ దేవరకొండ హీరో విజయ్ దేవరకొండ తన సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రశ్మిక మందన్నతో వివాహం అనంతరం తన సొంతూరు నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు మండలంలో ఉన్న తుమ్మన్ పేటకు సతీసమేతంగా వెళ్లిన విజయ్ అక్కడ రిసెప్షన్ జరుపుకున్నారు. అదే సందర్భంలో అచ్చంపేట డివిజన్ లో ఉన్న 45…
