డి.వి.ఎస్ రాజు 97వ జయంతి వేడుక : డి.వి.ఎస్.రాజు ప్రాతః కాల స్మరణీయులే!

DVS Raju's 97th birth anniversary celebration: DVS Raju is a memory of the times!

తెలుగు సినిమాకు అపారమైన సేవలందించిన డి.వి.ఎస్ రాజు 97వ జయంతి శనివారం జరిగింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్న తెలుగు సినిమా రంగాన్ని ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తరలించడంలోను, రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ఆస్కార్ అవార్డు సినిమా గాంధీ లాభాల్లో కొంత భాగాన్ని ఎన్.ఎఫ్.డి.సి అధ్యక్షుడుగా భారతీయ కార్మికుల నిధిని ఏర్పాటు చెయ్యడంలోను డి.వి.ఎస్ రాజు కీలకమైన భూమిక పోషించారు. రాజుగా సినిమా నిర్మాణం చేస్తూనే సినిమా రంగ సంస్థలను బలోపేతం చెయ్యడంలో విశేషమైన కృషి చేశారు. 1950 లో మహానటుడు ఎన్.టి.రామారావుతో పరిచయం రాజు గారి జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. రాజు గారిని తన భాగస్వామిగా చేసుకొని నేషనల్ ఆర్ట్ థియేటర్ సంస్థలో ఎన్.టి.ఆర్ ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. 1960లో రాజు గారు డి.వి.ఎస్ ప్రొడక్షన్స్ సంస్థను ప్రారంభించారు…

25న ‘దండోరా’ వేసిన‌ట్లే..

Just like 'Dandora' was played on the 25th..

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం ‘క‌ల‌ర్ ఫోటో’.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్నచిత్రం ‘దండోరా’. ఈ మూవీ  శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు పాత్ర‌ధారులు. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 25న మూవీ రిలీజ్ అవుతోంది. శనివారం ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సందర్బంగా న‌టుడు శివాజీ మాట్లాడుతూ ..తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్ట‌ర్‌గారు స్క్రిప్ట్ చెప్ప‌గానే ఏం చ‌దువుకున్నార‌ని అడిగాను. నేను అమెరికా నుంచి వ‌చ్చానని ఆయ‌న అన్నాడు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఎమోష‌న్స్‌తో కూడిన క‌మ‌ర్షియ‌ల్ మూవీ. జ‌నాల‌కు సందేశాలు, స‌ల‌హాలు ఇచ్చే…

Mowgli 2025 Movie Review in Telugu : పట్టు తప్పిన కథ!

Mowgli 2025 Movie Review in Telugu

యంగ్ హీరో రోషన్ కనకాల, సోషల్ మీడియా సెన్సేషన్ బండి సరోజ్ లతో ‘కలర్ ఫోటో’ దర్శకుడు సందీప్ రాజ్ రూపొందించిన చిత్రం ‘మోగ్లీ 2025’ ఈ వారం విడుదలయింది. ఈ సినిమాలో స్టార్ లు లేక‌పోయినా స‌రే విడుద‌ల‌కు ముందే ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని.. అంచ‌నాల్ని పెంచింది. అందుకు కార‌ణం.. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మించ‌డం.. ‘క‌ల‌ర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కావ‌డ‌మే. ఇందులో ప్ర‌తినాయ‌కుడిగా బండి స‌రోజ్‌కుమార్ న‌టించ‌డంతో ఈ సినిమా మ‌రింత ప్ర‌త్యేక‌త‌ని తీసుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ : పార్వతీపురం అనే ఒక కొండ ప్రాంతపు చిన్న గ్రామంలో నివసించే ముర‌ళీకృష్ణ అలియాస్ మోగ్లీ (రోషన్ క‌న‌కాల‌) ఓ అనాథ . చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన అతడు ఎస్సై కావాల‌నేది…

‘మోగ్లీ’ జెన్యూన్ లవ్ స్టొరీ..ఎప్పటికీ గుర్తుండిపోతుంది : హీరో రోషన్ కనకాల

'Mowgli' is a genuine love story...will be remembered forever: Hero Roshan Kanakala

యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం ‘మోగ్లీ 2025’తో అలరించబోతున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే టీజర్, పాటలు,  ట్రైలర్‌తో స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం డిసెంబర్ 13న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో రోషన్ కనకాల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మోగ్లీ కథ ఎలా ఉండబోతుంది? -ఇది ప్యూర్ అండ్ ఇన్నోసెన్స్ వుండే లవ్ స్టోరీ. ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ సందీప్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు.  స్క్రీన్ ప్లే చాలా రేసీగా…

15న రవీంద్రభారతి ప్రాంగణంలో బాలు విగ్రహావిష్కరణ

Unveiling of Balu's statue at Rabindra Bharathi campus on the 15th

– ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు – సాయంత్రం సినీ సంగీత దర్శకులు, గాయకులచే బాలు సంగీత స్వర నీరాజనం ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాన గాంధర్వుడు పద్మవిభూషణ్ డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఈనెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు ఎన్. అచ్యుత రామరాజు, కార్యదర్శి బి. ఎస్. కృష్ణమూర్తి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, భారత పూర్వ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పాల్గొని బాలు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర…