మాళవికా మోహనన్ ప్రస్తతం సౌత్ ఇండియాలో వరుస భారీ సినిమాలతో దూసుకెళుతోంది. 2013లో తన మొదటి సినిమానే దుల్కర్ సల్యాన్ వంటి స్టార్తో నటించి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత తమిళంలో రజనీకాంత్ పేట, విజయ్ మాస్టర్, ధనుష్ మారన్ వంటి పెద్ద సినిమాలతో అగ్ర హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల వచ్చిన విక్రమ్ ‘తంగలాన్’ సినిమాలో ఆరతిగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం పొందింది. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇదిలా ఉండగా ఈ ముద్దుగుమ్మ దాదాపు 7 సంవత్సరాల తర్వాత ‘యుద్ర’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్లో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘గల్లీబాయ్’, ‘గెహరియాన్’ వంటి సినిమాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిద్దార్థ్ చతుర్వేది హీరోగా తెరకెక్కిన ‘యుద్ర’ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించింది. సుమారు…
Year: 2024
మహిళలకు ఇది చీకటి కాలం.. చట్టాలను మార్చాలంటున్న అనన్య పాండే!
ఇది మహిళలకు చీకటి కాలమని బాలీవుడ్ నటి అనన్యపాండే అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ఇప్పుడు నటీమణులు వారి సమస్యలను ధైర్యంగా చెప్పగలుగుతున్నారని అన్నారు. సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయం గురించి మహిళలకు అవగాహన ఉండాలి. ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఇది మహిళలకు చీకటి కాలం. ఈ దాడులను ఆపడం కోసం ఏం చేయాలో ఆలోచించాలి. మన చుట్టూ ఉండే పరిసరాలను గమనించుకుంటూ ప్రతి వ్యక్తిపైనా అవగాహన కలిగిఉండాలి. నేను ఇలాంటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉంటాను. వాస్తవానికి చట్టాలను మార్చాల్సిన సమయం వచ్చింది. ఇది చాలా అవసరమైన నిర్ణయం. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో అనన్య ‘లైగర్’ గురించి ప్రస్తావించారు. సినిమాల్లోని సన్నివేశాలపై…
‘ఆదిత్య 369’ కోసం చిరంజీవి ప్రచారం!
బాలకృష్ణతో కలిసి ఓ ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని అగ్ర కథానాయకుడు చిరంజీవి తన మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి బాలకృష్ణ 50ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన ఈవెంట్కు చిరు, వెంకటేశ్ సహా పలువురు నటీనటులు, దర్శకులు హాజరై బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఇంద్ర’, ’సమరసింహారెడ్డి’ పాత్రలతో కథ సిద్ధం చేయాలని చిరంజీవి దర్శకులకు పిలుపునిచ్చారు. మరి అది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో తెలియదు కానీ, ఒకప్పుడు బాలకృష్ణ సినిమా కోసం చిరు ప్రచారం చేశారు. తండ్రి నట వారసత్వం పుణికి పుచ్చుకున్న బాలకృష్ణ తన సినీ కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో నటించారు. అలాంటి చిత్రాల్లో ‘ఆదిత్య 369’ ఒకటి. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొని సందడి చేశారు. ‘ఆదిత్య 369’ రిలీజ్…
నటన కోసం ఎలాంటి సాహసమైనా చేస్తా : హీరో విక్రమ్ వెల్లడి
కథ, అందులోని పాత్ర కోసం తమని తాము మార్చుకునే, నటుల్లో విక్రమ్ ఒకరు. అంతేకాదు, కమర్షియల్ కథల కన్నా ప్రయోగాత్మక చిత్రాలకే ఆయన పెద్ద పీట వేస్తారు. అందుకే అయన నుంచి ‘పితామగన్’, ‘కాశీ’, ‘అపరిచితుడు’,’ఐ’వంటి వైవిధ్యమైన చిత్రాలు వచ్చాయి. ఇటీవల ‘తంగలాన్’తో మరోసారి తన నట విశ్వరూపాన్ని నిరూపించారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 2001లో వినయన్ దర్శకత్వంలో వచ్చిన ‘కాశీ’ సినిమా విక్రమ్కు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో ఆయన అంధుడిగా నటించారు. అంతేకాదు… ఉత్తమ నటుడిగానూ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. పాత్ర కోసం విపరీతమైన శారీరక మార్పులకు ప్రయత్నించడం వల్ల కొన్ని సమయాల్లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ‘సినిమాల్లో పాత్రకు అవసరమైనట్లు మారడం, నటించడమంటే…
రాజమౌళి స్ఫూర్తితో ‘గోట్’ సినిమా నిర్మాణం!
‘గోట్’ చిత్రంలో దళపతి విజయ్ను కొత్తగా చూపించబోతున్నాం. భారీ తారాగణం ఉన్నా ఏడాదిలో చిత్రీకరణ పూర్తి చేశాం. దీనికి స్ఫూర్తి రాజమౌళి గారే. నేను ఆయనకు పెద్ద అభిమానిని. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను’ అని దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పారు. ఈ నెల 5న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు ప్రశాంత్ మాట్లాడుతూ .. ”ఇదొక అద్భుతమైన చిత్రం. ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంతమంది స్టార్స్తో ఒక సినిమా తీయడం మామూలు విషయం కాదు. వెంకట్ ప్రభు చాలా కష్టపడ్డారు. యువన్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రత్యేకాకర్షణ’ అన్నారు. నిర్మాత అర్చనా కల్పాతి మాట్లాడుతూ ‘ది గోట్’ చిత్రం గొప్ప విజయాన్ని సాధిస్తుదనే నమ్మకం…
వాహ్.. ‘దేవర’లోని చుట్టమల్లె పాటకు వందమిలియన్ వ్యూస్!
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో ‘దేవర’. జూనియర్ ఎన్టీఆర్ టైటిల్లో రోల్ పోషిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ ‘దేవర’ రెండు పార్టులుగా తెరకెక్కుతుండగా.. దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న గ్రాండ్గా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా చుట్టమ్లలె మెలోడీ ట్రాక్ను విడుదల చేశారని తెలిసిందే. తారక్, జాన్వీకపూర్ కెమిస్ట్రీలో వచ్చే ఈ డ్యుయెట్ సాంగ్ సినిమాకే హైలెట్గా ఉండబోతుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసి నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తోంది. ‘చుట్టమ్లలె..’ పాట విడుదలైన నెలలోపే (29 రోజులు) యూట్యూబ్లో 100 మిలియన్లకుపైగా వ్యూస్తో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ లో నిలుస్తుంది. ఈ సాంగ్ నాలుగు వారాలుగా మోస్ట్ ట్రెండింగ్…
‘ది డీల్’ మోషన్ పోస్టర్ విడుదల
ఈశ్వర్ సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు వెండితెరకు పరిచయమైన హను కోట్ల. తొలి చిత్రంలో మూగ పాత్రలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తరువాత తన నటనను మరింత మెరుగుపరచుకోవాలనుకున్నారు. అలాగే దర్శకత్వ శాఖలో కూడా తన ప్రతిభను చూపించాలనుకున్నాడు..కానీ అప్పటికే హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగటం వల్ల ఈశ్వర్ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ తగిన పాత్ర కోసం ఎదురుచూశారు.. ఇప్పుడు ‘ది డీల్’ అనే సినిమా ద్వారా హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఆధునిక తెలుగు నాటక రంగంలో నటుడిగా, దర్శకుడి గా అనేక ప్రయాణాలు చేసి రంగస్థలం పై ఎన్నో విజువల్ వండర్స్ ని క్రెయేట్…
అత్యంత వైభవంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుక!
నందమూరి బాలకృష్ణ నటుడిగా సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర పరిశ్రమ, అభిమానులు కలిసి బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్ నోవాలెట్ ఆడిటోరియమ్ వేదికగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సందర్బంగా… నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ… ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంత కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం…
Kaalam Raasina Kathalu Success Celebrations
Kaalam Raasina Kathalu, directed and produced by MVN Sagar, premiered in theaters on August 29. The film features a fresh cast, including MVN Sagar, Shruti Shankar, Vikas, Viharika Chaudhary, Abhilash Goguboina, Uma Recharla, Rohit Konda, Hanvika Srinivas, Ravi Teja Bonala, Pallavi Rathore, and Reshma. The makers held a success meet yesterday. In a recent success event for the film, the cast and crew celebrated its positive response from audiences. The lead actress, Hanvika, expressed her gratitude during the event: “I want to thank all the media people who attended our…
కాలం రాసిన కథలు సక్సెస్ సెలబ్రేషన్స్
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం ‘కాలం రాసిన కథలు.’ నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు. దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, “ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్ ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమా లో పెద్ద స్టార్స్ లేకున్నా,…
