సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్ని కెరియర్ కి ఆర్య లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించిన సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హిట్ అందించాడు. ఈ చిత్రం రిలీజై దాదాపు సంవత్సరం కావొస్తున్నా పుష్ప రాజ్ సృష్టించిన ఇంపాక్ట్ ఇప్పటకి అలానే ఉంది. ప్రస్తుతం పుష్ప చిత్రం రష్యా లో డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసిందే. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ ‘పుష్ప’ ట్రైలర్ ని రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. రష్యా భాషలోని ట్రైలర్ చూస్తుంటే మనకు భాష అర్ధంకాకపోయిన క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్ధమవుతుంది. దీనికి కారణం పుష్ప చిత్రం మనపై చూపించిన ప్రభావమే. పుష్ప డబ్బింగ్ విషయంలో…
Year: 2022
24 గంటల్లో 30 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన మిస్టీరియస్ డార్క్ థ్రిల్లర్ ‘చుప్’
మన ఇండియాలో ఎంటర్టైన్మెంట్ రంగానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ రంగంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఓటీటీ ఇప్పుడు ప్రేక్షకులకు చాలా చేరువయ్యాయి. ఈ ఓటీటీ మాధ్యమాల్లో వేగంగా అభివృద్ధి అవుతూ నెంబర్ 1 వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్గా ఎదుగుతున్న సంస్థ జీ 5. ఇందులో నవంబర్ 25 నుంచి ‘చుప్: రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. పెన్ స్టూడియోస్ బ్యానర్పై జయంతి లాల్ గడా, గౌరి షిండే, రాకేష్ జున్జున్వాలా, హోప్ ప్రొడక్షన్స్ అనీల్ నాయుడు నిర్మించిన ఈ చిత్రాన్ని ఆర్.బాల్కి దర్శకత్వం వహించారు. సన్నీడియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రీమియర్…
‘హిట్ 2’ తప్పకుండా హిట్టే అవుతుంది : దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి
అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 2 ది సెకండ్ కేస్’. నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమాపై శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా రూపొందిన చిత్రం ‘హిట్ 2’. మీనాక్షి చౌదరి హీరోయిన్. డిసెంబర్ 2న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా… దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ‘‘ఇన్ని రోజులు ఇంగ్లీష్లో మాట్లాడి మాట్లాడి చిరాకేసింది. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే చాలా హాయిగా ఉంది. హిట్ అనేది సినిమాలా కాకుండా ఫ్రాంచైజీగా తయారు చేసిన నాని, ప్రశాంతి, శైలేష్లకు కంగ్రాట్స్. అదంత ఈజీ కాదు.. హిట్ సినిమా చేయొచ్చు కానీ..…
‘భగత్ సింగ్ నగర్’ ఓటిటిలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘భగత్ సింగ్’ రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ బాషలో ఏక కాలంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో యాక్షన్ తో పాటు.. ఎమోషనల్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకుల మనసులను దోచుకొన్న ఈ చిత్రం తాజాగా ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఓటిటిలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను థియేటర్స్ లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా తిరిగి ఓటీటీలోకి ఎపుడు వస్తుందా? అని వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు డిసెంబర్ 2న తెరపడనుంది.…
T-Hub and MEESchool present the Cinepreneur Entrepreneurship Orientation @ Thub for students of Fine art, Mass communication & Engineering for upcoming cohorts
: T-Hub, which leads India’s pioneering innovation ecosystem, and MEESchool (Media & Entertainment E School), an initiative to bridge the skill deficiency in the Media and Entertainment Space have announced the opening of the Cinepreneur Entrepreneurship Certification course second Cohort. On the Occasion of Interaction with various college students from Hyderabad @ THUB Mr. Kk Senthil in conversation with CEO M. Srinivas rao , appreciating the initiative of THUB by the govt , emphasised that the Cineprenuer program is initiated in the right time as the industry is booming right…
టి-హబ్, మీస్కూల్ ఆధ్వర్యంలో సినీ ప్రెన్యూర్ షిప్ కోర్సు
ఇప్పటికే విజయవంతంగా కోహర్ట్-1 పూర్తి : డిసెంబరు నుంచి రెండో కోహర్ట్; రిజిస్ట్రేషన్లు ప్రారంభం హైదరాబాద్, అక్టోబర్ 30, 2022: భారతదేశంలో ఇన్నోవేషన్ కేంద్రాల్లో పేరొంది టి-హబ్, మీస్కూల్ (మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ ఈ స్కూల్) కలిసి సినీప్రెన్యూర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సర్టిఫికేషన్ కోహర్ట్-2ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే విజయవంతంగా ఒక బ్యాచ్ పూర్తిచేసి, ఇప్పుడు రెండో బ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి. సినీప్రెన్యూర్ అనేది మీడియా మరియు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ (ఎం అండ్ ఈ) కార్యక్రమం. ఇందులో మీడియా వ్యాపారంపై ఆసక్తి ఉన్నవారికి మాడ్యూళ్లవారీగా శిక్షణ ఉంటుంది. సినీ నిర్మాణం నుంచి కమ్యూనికేషన్ల వరకు అన్నీ ఇందులో ఉంటాయి. సినీ నిర్మాణానికి సంబంధించిన అన్ని రంగాల్లో అంటే.. స్క్రిప్టు రైటింగ్, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, సినీ నిర్మాణం, వాయిస్ ఓవర్, ఫిల్మ్ బ్రాండింగ్,…
‘బైరాన్ పల్లి’ చిత్ర ప్రదర్శన : పోస్టర్ విడుదల
శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్ పై వెంకట్ కాచర్ల దర్శకత్వంలో నరేష్ వర్మ ముద్దం నిర్మించిన ‘బైరాన్ పల్లి’ చిత్రం చాలా బాగుందని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. సోమవారం ప్రసాద్ ల్యాబ్ లో ‘బైరాన్ పల్లి’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన మామిడి హరికృష్ణ ‘బైరాన్ పల్లి’ చిత్రాన్ని తిలకించిన తర్వాత పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”బైరాన్ పల్లి చిత్రం అద్భుతంగా వచ్చిందని ఇందులో హర్రర్ సన్నివేశాలు ప్రతి పేక్షకుణ్ణి కట్టిపడేస్తాయని పేర్కొన్నారు. ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుందని, మంచి వసూళ్లు రాబడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ‘బైరాన్ పల్లి’ చిత్ర నిర్మాత నరేష్ ముద్దం, పలు చిత్రాల నిర్మాత ఆసంపల్లి, సీనియర్ జర్నలిస్టు, పలు…
రైతుల తిరుగుబాటు నేపథ్యంలో `నాగలి`
1995లో `తపస్సు` అనే సినిమాలో నటించిన ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి మళ్లీ 27 సంవత్సరాల తరువాత ప్రముఖ పాత్రలో ఒక రైతుగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ది డ్రీమ్స్ కంపెనీ బ్యానర్ పై శ్రీమతి పావని మొక్కరాల సమర్పణలో `నాగలి` అనే సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు భరత్ పారేపల్లి మాట్లాడుతూ….“ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నూతన నటీనటులతో చిత్రీకరణ జరిపాము. నూతన కథానాయకుడు సుదీప్ మొక్కరాల నిడదవోలు, కథానాయకి అనుస్మతి సర్కార్ ముంబాయి, హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో నాలుగు పాటలు ఎంఎల్ రాజా సంగీత సమర్పణలో జరిగాయి. రైతుల ఆత్మహత్యలు… వాళ్ళ కథలు , వెతలు కలయబోసిన 1857, 58ల మధ్య జరిగిన సిపాయిల తిరుగుబాటును తలపించేలా ఇప్పుడు రైతుల…
అన్ని రకాల పాత్రలు చేయాలనే కోరిక ఉంది : ‘మసూద’ విజయంపై హీరో తిరువీర్
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’. సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాశ్, సత్యం రాజేష్ తదిరులు ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రంతో సాయికిరణ్ని దర్శకుడిగా పరిచయం చేశారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా. నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సంద్భంగా హీరో తిరువీర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే… – పరేషాన్ సినిమా చేస్తున్న సమయంలో మసూద గురించి తెలిసింది. సినిమాటోగ్రఫర్ జగదీష్ చీకటి ద్వారా ఈ సినిమా గురించి నాకు తెలిసింది. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సినిమా ఆఫర్…
సీజన్ అఫ్ మ్యాజిక్ లో “గుర్తుందా శీతాకాలం”
యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం. ఈ చిత్రం ద్వారా కన్నడ దర్శకుడు, నటుడు నాగశేఖర్ ని తెలుగుతెరకి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వేదాక్షర ఫిల్మ్స్ , నాగశేఖర్ మూవీస్ మరియు మణికంఠ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై నిర్మాతలు చింతపల్లి రామారావు, భావన రవి, నాగశేఖర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చినబాబు, ఎం, సుబ్బారెడ్ది ల సమర్పణలో కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు, డిసెంబర్ 9 న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. ”శీతాకాలం తో నాకు ప్రత్యేకమైన పరిచయం లేకపోయినా.. ఈ శీతాకాలం మాత్రం నాకు గుర్తుండిపోతుంది. ఈ సినిమా లో హీరో సత్యదేవ్ , తమన్నా, మెఘా ఆకాష్, కావ్యాశెట్టి లు…
