పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
‘విశ్వంభర’కు మోక్షం ఎప్పుడు? .. కొత్త రిలీజ్ ప్లాన్పై క్లారిటీ లేదు
Spread the love మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ, సినిమా విడుదల మాత్రం ఆలస్యమవుతూనే ఉంది. ఈ చిత్రాన్ని... -
కార్యదీక్షా పరుడు..వివాద రహితుడు కొండపనేని ఉమామహేశ్వరరావు
Spread the love * ఏపీ ఎఫ్.డి.సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కొండపనేని ఉమామహేశ్వరరావుకు ఫిలింక్రిటిక్స్ సత్కారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం... -
ఏపీ ఎస్.ఎఫ్.టీవీ టీడీసీ చైర్మన్ భరత్ భూషణ్ కు ఫిలిం క్రిటిక్స్ సత్కారం
Spread the love ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్...
