పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
‘బాహుబలి… ది ఎపిక్ 2025’ విడుదల వెనుక లాయిడ్ గ్రూప్ అధినేత..?
Spread the love ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత ‘బాహుబలి- ది ఎపిక్2025’ విడుదల వెనుక ఉన్నారంటే… ఆ సినిమాని తను రిలీజ్... -
‘బాహుబలి’ని శిఖర స్థాయిలో నిలబెట్టే మహోన్నత ఆలోచన
Spread the love ఏడేళ్ల క్రితమే విక్రం నారాయణ రావు గారి ఐడియాలజీకి హ్యాట్సాప్! ఒక చక్కని ఆలోచన సంచలనాలు సృష్టిస్తుంది..... -
Andela Ravamidi Movie Review: A commendable effort!
Spread the love Indrani Davuluri, who is passionate about Indian dance, entered the film industry as a...