పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి
Spread the love మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు.... -
‘కాక్రోచ్’లో మన సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం : దర్శక నిర్మాతలు పి. సునీల్ కుమార్ రెడ్డి, బి. బాపిరాజు
Spread the love సొంత ఊరు, గంగపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస వంటి చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు... -
ఆనంద చక్రపాణికి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్
Spread the love నటుడు, దర్శకుడు ఆనంద చక్రపాణికి మధ్యప్రదేశ్ లో జరిగిన వింధ్య ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ సపోర్టింగ్...
