పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్ని విజయ్దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
‘రుద్రమదేవి’ చిత్రానికి గద్దర్ అవార్డుని ప్రకటించడం ఎంతో ఆనందంగా, ప్రోత్సాహకరంగా ఉంది : దర్శక, నిర్మాత గుణ శేఖర్
Spread the love తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2015లో వచ్చిన చిత్రాల్లోంచి ‘రుద్రమ దేవి’,... -
“B.N. Reddy film Award Is a Great Honor,” Says Director Sukumar
Spread the love Creative filmmaker honored with prestigious recognition Acclaimed filmmaker Sukumar, who proved his brilliance... -
బీఎన్ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను : దర్శకుడు సుకుమార్
Spread the love తొలిచిత్రంతో ‘ఆర్య’తోనే దర్శకుడు తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు సుకుమార్. ఆ తరువాత జగడం, ఆర్య-2, 100 పర్సెంట్...