శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా `మా ఊరి పొలిమేర` చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతోంది. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, బాలాదిత్య, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.ఈ చిత్రానికి సంగీతం: గ్యాని, సినిమాటోగ్రఫీ: ఖుషేందర్ రమేష్ రెడ్డి, పీఆర్వో: వంగాల కుమారస్వామి, ఆర్ట్ డైరక్టర్: ఉపేంద్ర రెడ్డి చందా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎన్.సి.సతీష్ కుమార్, నిర్మాత: గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్: డా.అనిల్ విశ్వనాథ్.
‘మా ఊరి పొలిమేర’ సీక్వెల్ షూటింగ్ పూర్తి!!
